Guntur Kaaram: ఫస్ట్ పోస్టర్‌పై వచ్చిన విమర్శలతో.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కి మరో మాస్ పోస్టర్

ABN , First Publish Date - 2023-08-09T17:38:56+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ మాస్ ఎంటర్‌టైనర్ ‘గుంటూరు కారం’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రెండు మాస్ పోస్టర్స్‌ని వదిలి ఫ్యాన్స్‌కి మేకర్స్ ట్రీట్ ఇచ్చారు.

Guntur Kaaram: ఫస్ట్ పోస్టర్‌పై వచ్చిన విమర్శలతో..  మహేష్ బాబు ఫ్యాన్స్‌కి మరో మాస్ పోస్టర్
Mahesh Babu in Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) సూపర్ మాస్ ఎంటర్‌టైనర్ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా, స్టైలిష్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్న మహేష్ బాబు సూపర్ మాస్ పోస్టర్‌‌లను చిత్ర బృందం విడుదల చేసింది. ఫస్ట్ పోస్టర్‌లో లుంగీ కట్టుకొని, కళ్లద్దాలు పెట్టుకొని, బీడీ కాలుస్తున్న మహేష్ బాబు లుక్‌ని మేకర్స్ విడుదల చేయగా.. ఆ పోస్టర్‌పై ఫ్యాన్స్ కూడా విమర్శలు చేశారు. దీంతో మేకర్స్ మరో పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో జీన్స్, బ్లాక్ టీ షర్ట్ పై రెడ్ కలర్ షర్ట్, ఎర్రని తలపాగా‌తో ప్రత్యర్థుల‌తో తలపడుతున్నట్లుగా కనిపిస్తోంది.


Mahesh-Babu-1.jpg

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) జయంతి సందర్భంగా మాస్ స్ట్రైక్ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ అద్భుతమైన స్పందనను రాబట్టుకోగా.. ఇప్పుడొచ్చిన పోస్టర్స్‌తో మరోసారి ‘గుంటూరు కారం’ వార్తల్లో హైలెట్ అవుతోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న విధానం చూస్తే.. మహేష్ ఫ్యాన్స్‌కి ఈ బర్త్‌డే‌కి ట్రీట్ ఉండదేమో అనేలా వార్తలు వైరల్ అయ్యాయి. అలాంటి వార్తలకు బ్రేక్ వేస్తూ.. మేకర్స్ రెండు పోస్టర్స్‌ వదిలారు. (Guntur Kaaram Mass Posters)

Mahesh-Babu-2.jpg

‘గుంటూరు కారం’ షూటింగ్‌ను ఆగస్ట్ ద్వితీయార్థంలో పునఃప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన టాలీవుడ్ క్రష్ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు. (Guntur Kaaram Movie Update)


ఇవి కూడా చదవండి:

***************************************

*Nagababu: మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన లేదు కానీ.. నిజం మాట్లాడిన వ్యక్తిపై విషం కక్కుతారా?

***************************************

*Anil Sunkara: ‘భోళా శంకర్’ చేసేటప్పుడు.. మహేష్ బాబు ఏం చెప్పారంటే..

***************************************

*Jr NTR: కిర్రాక్.. లుక్ అదిరింది.. ఏమున్నాడ్రా బాబు..!

***************************************

*Rajini and Chiru: అక్కడ రజనీకాంత్.. ఇక్కడ చిరంజీవి.. ఇలా తగులుకున్నారేంటయ్యా..

***************************************

*Malavika Mohanan: పచ్చరంగు స్విమ్‌ సూట్‌లో..

***************************************

Updated Date - 2023-08-09T18:36:37+05:30 IST