మత్తెక్కిస్తున్న రుక్సార్‌ థ్రిల్లాన్

హీరోయిన్  రుక్సార్‌ థ్రిల్లాన్    లండన్    పుట్టారు. బేసిగ్గా ఆమె పంజాబీ అమ్మాయి.

ఫ్యాషన్  డిజైనింగ్‌ పూర్తి చేశాక హీరోయిన్  కావాలని కలలు కంది. 'రన్ ఆంటోని' చిత్రంతో హీరోయిన్ గా  పరిచయమైంది.

'ఆకతాయి' సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బెంగళూరులో సెటిల్‌ అయింది.

నేచురల్‌ స్టార్‌ నానికి జోడీగా 'కృష్ణార్జున యుద్ధం', అల్లు శిరీష్‌ హీరోగా వచ్చిన ఏబీసీడీ మూవీలో నటించింది.

తెలుగులో నటించిన మూడు చిత్రాలు ఆమెకు ఏమాత్రం గుర్తింపు తీసుకురాలేదు.

దాంతో బాలీవుడ్‌ బాట పట్టింది. 'బాంగ్రా పా లే' సినిమా చేసింది. అది కూడా అంతంత మాత్రంగానే ఆడింది.

 మళ్లీ టాలీవుడ్‌కి వచ్చి విశ్వక్‌సేన్  తో 'అశోకవనంలో అర్జున కల్యాణం' చిత్రంలో నటించి తొలి హిట్‌ అందుకొంది

తరువాత కొత్త హీరోతో 'స్పార్క్‌' అనే సినిమాలో నటించినా అది కూడా పెద్దగా ఉపయోగపడలేదు.

ఇన్ స్టాగ్రామ్‌లో మాత్రం ఫ్యాన్స్ కు హాట్‌హాట్‌ ఫొటోలతో నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా పోస్ట్‌ చేసిన ఫొటో షూట్‌ ఒకటి నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతోంది.