‘ది ఇండియన్ బార్డర్’ నుంచి ‘జిందా రహేన్ తో డ్యూటీ’ సాంగ్ విడుదల
ABN , Publish Date - Aug 15 , 2026 | 08:42 PM
ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నివేద్య రెడ్డి నిర్మాణంలో డి.ఎస్. బాషా దర్శకత్వం వహించిన చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’. ఈ మూవీ నుంచి దేశభక్తి గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు.
ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నివేద్య రెడ్డి నిర్మాణంలో డి.ఎస్. బాషా దర్శకత్వం వహించిన చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’ (The Indian Border). ఈ సినిమాలో కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీ మోహన్, మేఘా శ్రీ,, సిందు తులాని వంటివారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా శనివారం ఈ మూవీ నుంచి ఓ దేశభక్తి గీతాన్ని విడుదల చేశారు. ‘జిందా రహేన్ తో డ్యూటీ’ (Zinda Rahein Toh Duty) అంటూ సాగే ఈ పాట అడ్రినల్ రష్లా ఉంది. గూస్ బంప్స్ ఇచ్చేలా, నరనరాల్లో దేశభక్తిని రగిల్చేలా ఈ పాట సాగింది. ఈ పాటకు ఆనంద్ మంత్ర బాణీ, డి.ఎస్. బాషా సాహిత్యం, శరవణ గాత్రం దేశ భక్తి గీతంగా మార్చేసింది. జవాన్ల త్యాగాల్ని, ధైర్య సాహసాల్ని గుర్తు చేసేలా ఈ పాట సాగింది. కె మ్యూజిక్ ఈ మూవీ ఆడియో రైట్స్ను దక్కించుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో మేజర్ ఎస్పీఎస్ ఒబేరాయ్ మాట్లాడుతూ.. దేశం గురించి, సైన్యం గురించి ఇలాంటి గొప్ప సినిమా తీసినందుకు ఆనందంగా ఉంది. అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బయటి ఆహారాన్ని తినొద్దు. నాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. ఈ మూవీ మంచి విజయం సాధించాలని అన్నారు. హీరో, రైటర్ కిరణ్ యార్లగడ్డ మాట్లాడుతూ.. పాలస్తీనా వార్ టైంలో ఈ కథ నాలో పుట్టింది. డి.ఎస్. బాషా ఈ కథకు ఓ స్వరూపాన్ని తీసుకొచ్చారు. ఎక్స్ ఆర్మీ పర్సన్స్, మీడియా మాకు ఎంతగానో సపోర్ట్ చేసింది. సైనికుడు చేసే త్యాగం, సైనికుడి భార్య చేసే త్యాగాల్ని ఇందులో చూపించాం. మాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని అన్నారు.
దర్శకుడు డి.ఎస్. బాషా మాట్లాడుతూ.. ‘‘ది ఇండియన్ బార్డర్’ ఈవెంట్కి వచ్చిన ఆర్మీ అధికారులు, మీడియా వారికి థాంక్స్. సైనికుడి త్యాగం, ఆలోచనలు, గొప్పదనం చెప్పేలా ఈ సినిమా ఉంటుంది. అందుకే ఈ పాటను కూడా సైనికుడికి అంకితం చేసేలా తీశాం. మనం ఈ రోజు ఇక్కడ ఇలా సంతోషంగా ఉన్నామంటే, కారణం అక్కడ సైనికుడు చేసే త్యాగమే. కిరణ్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఇంత మంచి కథతో వస్తోన్న సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని అన్నారు. నిర్మాత నివేద్య రెడ్డి మాట్లాడుతూ.. అందరం కలిసి ఓ ఫ్యామిలీలా ఈ సినిమాకు కష్టపడ్డాం. మా నాన్న కూడా సైనికుడే. ఈ చిత్రంతో మానవ సంబంధాలు, ఎమోషన్స్ని చూపించాలని అనుకున్నాం. సైనికులకు అంకితమిచ్చేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
ఇవి కూడా చదవండి:
బోనాలు.. ట్రోలింగ్పై ఫరియా అబ్దుల్లా ఎమోషనల్ వీడియో వైరల్!
SYG: సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’.. డేట్ ఫిక్స్
అర్జున్ బర్త్డే స్పెషల్.. ‘పొలిమేర 3’లో పవర్ఫుల్ పోస్టర్ విడుదల