మాస్ గాడ్ బాలయ్య.. ఊహించని కాంబినేషన్.. సిసలైన సర్ప్రైజ్
ABN, Publish Date - Mar 23 , 2026 | 04:27 PM
బాలకృష్ణ.. ఈ పేరు వింటేనే థియేటర్లలో బాక్సులు బద్దలైపోవాలి. డైలాగ్ పేలితే విజిల్స్ మోత మోగిపోవాలి.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఈ పేరు వింటేనే థియేటర్లలో బాక్సులు బద్దలైపోవాలి. డైలాగ్ పేలితే విజిల్స్ మోత మోగిపోవాలి. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న మ్యాన్ ఆఫ్ మాసెస్, ఇప్పుడు ఒక ఊహించని కాంబినేషన్లో సినిమా చేయబోతున్నారనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. విలక్షణమైన కథలతో మ్యాజిక్ చేసే వివేక్ ఆత్రేయ, మాస్ గాడ్ బాలయ్య సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారనే వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.
ప్రస్తుతం బాలయ్య బాబు, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు. మొదట ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఉంటుందని భావించినప్పటికీ, ప్రస్తుత ట్రెండ్ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ దీన్ని ఒక పక్కా యాక్షన్ డ్రామాగా మలిచారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో బాలయ్య సరసన నయనతార (Nayanthara) కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ గతంలో సింహా, శ్రీరామరాజ్యం వంటి సినిమాలతో సూపర్ హిట్ అనిపించుకుంది. అలాగే ఇప్పుడు రాబోతున్న సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
అయితే, అసలు సిసలైన సర్ప్రైజ్ ఇక్కడే ఉంది. సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాతో మాస్ ఆడియన్స్ను కూడా మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya), ఇప్పుడు బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. వివేక్ ఆత్రేయ సినిమాల్లో స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఆయన మార్క్ మేకింగ్ స్టైల్ బాలయ్య బాబు మాస్ ఇమేజ్కు తోడైతే, రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి.
ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇందులో బాలయ్య ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తారట. సుమారు మూడు దశాబ్దాల క్రితం యువరత్న రాణా అనే సినిమాలో బాలయ్య గ్యాంగ్స్టర్గా కనిపించి మెప్పించారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత, ఇప్పటి ట్రెండ్కు తగ్గట్టుగా, వివేక్ ఆత్రేయ మార్క్ ఎలివేషన్స్తో ఒక పక్కా గ్యాంగ్స్టర్ డ్రామా రాబోతోంది. ఇది కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా, వివేక్ స్టైల్ ఇంటెలిజెంట్ డ్రామాతో కూడి ఉంటుందని సమాచారం. సాధారణంగా వివేక్ ఆత్రేయ సినిమాలు క్లాస్ టచ్తో సాగుతుంటాయి. కానీ సరిపోదా శనివారం సినిమాతో తాను మాస్ పల్స్ కూడా పట్టగలనని ఆయన నిరూపించుకున్నారు.
బాలయ్య బాబును కేవలం డైలాగులకే పరిమితం చేయకుండా, ఒక సరికొత్త గ్యాంగ్స్టర్ అవతారంలో చూపించాలనేది ఆయన ప్లాన్. నందమూరి అభిమానులకు ఇది నిజంగా ఒక ఐ ఫీస్ట్ అని చెప్పవచ్చు. తదనుగుణంగా, ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. గోపీచంద్ మలినేని సినిమా పూర్తయిన వెంటనే ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరి వివేక్ ఆత్రేయ మార్క్ స్క్రీన్ ప్లేలో బాలయ్య గర్జన ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.