సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Supriya Yarlagadda: నాగార్జునతో గొడవ.. సుప్రియ ఏం చెప్పిందంటే

ABN, Publish Date - Aug 10 , 2026 | 09:31 PM

వైవిధ్యమైన కథలను, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్, ఈసారి తెలంగాణ పల్లెటూరి నేటివిటీతో కూడిన పూర్తి స్థాయి కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాతో 'పళ్ళ బురుసు' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Supriya Yarlagadda

వైవిధ్యమైన కథలను, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్, ఈసారి తెలంగాణ పల్లెటూరి నేటివిటీతో కూడిన పూర్తి స్థాయి కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాతో 'పళ్ళ బురుసు' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగర్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఇక ఈ వేడుకలో సుప్రియ.. తన చినమామ నాగార్జున గురించి చెప్పుకొచ్చింది. సుప్రియా.. నాగ్ సోదరి సత్యవతి కుమార్తె. ప్రస్తుతం ఆమె నిర్మాతగా మారి సినిమాలు చేస్తోన్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా మొత్తం తండ్రీకొడుకుల మధ్య గొడవల మధ్య సాగుతుంది. దీంతో యాంకర్.. ఒకవేళ సుప్రియకు చినమామ నాగార్జునతో గొడవ అయితే ఏ విషయంలో వస్తుంది అన్న ప్రశ్నకు.. ' అమ్మో.. ఆయన బెస్ట్.. చినమామ ఆయన ఏది చెప్తే అది. అస్సలు మాట్లాడము. అందుకే ఆయన రాకముందే మాట్లాడి వెళ్లిపోతున్నా.. ఎందుకు అంటే ఆయన ముందు నోరు తిరగదు కదా' అంటూ చెప్పుకొచ్చింది.


పళ్ళ బురుసు గురించి సుప్రియ మాట్లాడుతూ.. ' ఈ కథ మొదటిసారి విన్నప్పుడే సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాను. చాలా స్వీట్ స్టోరీ. ఇలాంటి కథను చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ కొత్త కథలనే వెతుకుతుంది. ఈసారి ఎపిక్ స్టూడియోస్‌తో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. తాతయ్య ఉండి ఉంటే కచ్చితంగా మంచి పని చేశావు అని చెప్పేవారు. కొత్తవాళ్లతో పాటు సీనియర్ యాక్టర్స్ కలిసి చేసిన సినిమా ఇది. ఇది చాలా బ్యూటిఫుల్ స్టోరీ. ఇందులో చాలా లోతైన సందేశం కూడా ఉంది. ఈ సినిమా చేయడం మాకు చాలా ప్రౌడ్‌గా అనిపిస్తోందని' తెలిపింది.

Updated Date - Aug 10 , 2026 | 09:32 PM