సందీప్ వంగా - మహేష్ కాంబో ఫిక్స్.. ఇదే సాక్ష్యం
ABN, Publish Date - Aug 10 , 2026 | 04:35 PM
సినీ ప్రపంచంలో అందరిలా ఆలోచిస్తే ఆయన సందీప్ రెడ్డి వంగా ఎందుకు అవుతాడు? అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు ప్రతి సినిమాలోనూ, తన ప్రతి ఆలోచనలోనూ ఒక విలక్షణమైన ముద్ర వేసే ఈ ఫైర్బ్రాండ్ డైరెక్టర్, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా అది ఒక సంచలనమే అవుతుంది.
సినీ ప్రపంచంలో అందరిలా ఆలోచిస్తే ఆయన సందీప్ రెడ్డి వంగా ఎందుకు అవుతాడు? అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు ప్రతి సినిమాలోనూ, తన ప్రతి ఆలోచనలోనూ ఒక విలక్షణమైన ముద్ర వేసే ఈ ఫైర్బ్రాండ్ డైరెక్టర్, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా అది ఒక సంచలనమే అవుతుంది. గతంలో చిరంజీవి ఆరాధన పోస్టర్తో మెగా ఫ్యాన్స్ని ఫిదా చేసిన సందీప్, ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చేసిన ఒక వినూత్న ప్రయోగం ఇప్పుడు టాలీవుడ్లో సరికొత్త చర్చకు తెరలేపింది.
సాధారణంగా ఒక హీరో పుట్టినరోజు వస్తే డిజైనర్ పోస్టర్లతో శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ. కానీ సందీప్ వంగా ఏఐ సాంకేతికతను వాడుకుని మహేష్ కి శుభాకాంక్షలు చెప్పి షాక్ ఇచ్చాడు. మహేష్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ ఐకానిక్ మూవీ కిరాయి కోటిగాడులోని మాస్ సీన్ను రీ-క్రియేట్ చేశాడు. 'పేరు కోటిగాడు.. ఊరు తెనాలి. ఉద్యోగం కిరాయి తీసుకొని కాళ్లూ చేతులు విరగ్గొట్టడం' అంటూ కృష్ణ చెప్పే ఆల్-టైమ్ మాస్ డైలాగ్ను మహేష్ బాబు గొంతుతో, ఆయన బీడీ వెలిగిస్తున్న ఆల్ఫా యాటిట్యూడ్ అవతార్లో ప్రెజెంట్ చేసి ఏకంగా నెట్టింటిని షేక్ చేశాడు. ఇక దీంతో మహేష్ ఫ్యాన్స్ అందరూ సందీప్ - మహేష్ కాంబో ఫిక్స్ అయిన్నట్లే అని చెప్పుకొస్తున్నారు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్పెషల్ విష్ చూసిన తర్వాత ఘట్టమనేని అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. వారణాసి తరువాత మహేష్ .. సందీప్ రెడ్డి దర్శకత్వంలోనే ఒక సినిమా చేయనున్నాడని టాక్ నడుస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో మహేష్ బాబుతో సందీప్ రెడ్డి వంగా సినిమా తీస్తే, అది కచ్చితంగా ఈ కిరాయి కోటిగాడు తరహాలో అత్యంత పవర్ఫుల్, రా యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్తోనే ఉంటుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఏది ఏమైనా, రాజమౌళి వారణాసి అప్డేట్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్కు సందీప్ వంగా ఇచ్చిన ఈ ఏఐ సర్ప్రైజ్ ఒక రేంజ్లో కిక్ ఇచ్చిందనే చెప్పాలి.