సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కింగ్ సైలెన్స్.. ఎందుకు

ABN, Publish Date - Aug 06 , 2026 | 09:02 PM

సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా స్టార్ట్ అయ్యింది అంటే దానికి ఉన్న హడావిడి అంతా ఇంతా కాదు. పూజా కార్యక్రమాల దగ్గరనుంచి రిలీజ్ అయ్యేవరకు కూడా ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు పోస్టర్ రిలీజ్ అవుతుందా.. టీజర్ రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు.

King 100

సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా స్టార్ట్ అయ్యింది అంటే దానికి ఉన్న హడావిడి అంతా ఇంతా కాదు. పూజా కార్యక్రమాల దగ్గరనుంచి రిలీజ్ అయ్యేవరకు కూడా ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు పోస్టర్ రిలీజ్ అవుతుందా.. టీజర్ రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. సినీ పరిశ్రమలో పీఆర్ బజ్ లేదా లీక్స్ రావడం సహజమే. ఇక ఆసక్తిని మేకర్స్ హైప్ క్రియేట్ చేసుకోవడానికి వాడుకుంటారు. షూటింగ్ మొదలైనప్పుడు ఒక ఫోటో.. సెట్ లో ఉన్నప్పుడు ఒక ఫోటో.. బర్త్ డే కి టీజర్.. పండగకు పోస్టర్.. ఇలా ఫ్యాన్స్ ని హైప్ తో పిచ్చెక్కిస్తుంటారు. కానీ, అక్కినేని నాగార్జున మాత్రం.. తన 100వ చిత్రాన్ని ఎటువంటి ముందస్తు హడావుడి లేకుండా, అత్యంత నిశ్శబ్దంగా పూర్తి చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.


అక్కినేని నాగార్జున హీరోగా రా కార్తీక్ దర్శకత్వంలో కింగ్ 100 వ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ.. పాన్ ఇండియా దిశగా.. వంద కోట్ల క్లబ్ లలో చేరుతుంటే.. నాగ్ మాత్రం చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అది కాకుండా కుబేర, కూలీ లాంటి సినిమాల్లో నాగ్ కీలక పాత్రలు పోషించడం..ఆయనకు కలిసిరాలేదు. దీంతో ఇప్పుడు నాగ్ సోలో హీరోగా వస్తున్న ఈ సినిమా విజయంతోనే ఆయన కెరీర్ ఆధారపడి ఉంది. అంత ముఖ్యమైన ప్రాజెక్టు అయ్యి ఉండి కూడా నాగ్ ఎందుకని ఇంత మౌనం వహిస్తున్నాడు అనేది మిస్టరీగా మారింది.


ఇక ఈ మైలు రాయి సినిమాకు సంబంధించిన ఏ ఒక్క లీక్ ని కూడా నాగ్ బయటకు పొక్కనివ్వడం లేదు. ఈ క్రమంలో ఆగస్ట్ 29న రాబోతున్న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అభిమానులను సర్ప్రైజ్ చేసేవిధంగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అందుతున్న సమాచారం ప్రకారం.. టీజర్ లేదా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే దర్శకుడు కార్తీక్ టీజర్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. లాటరీ కింగ్, కింగ్ 100 అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఒకదాన్ని ఫైనల్ చేయబోతున్నారని టాక్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ నటి టబు, నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. బాక్సాఫీస్ వద్ద ఎంత పోటీ ఉన్నప్పటికీ, ఈ 100వ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి బరిలోనే నిలపాలని నిర్మాతలు పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. మరి నాగ్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Aug 06 , 2026 | 09:11 PM