కనుల పండువగా నారా దేవాన్ష్ ధోతీ వేడుక
ABN, Publish Date - Mar 15 , 2026 | 08:44 AM
మంత్రి లోకేశ్, బ్రాహ్మణి తనయుడు దేవాన్ష్ నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ నివాసంలో నారా, నందమూరి కుటుంబసభ్యుల నడుమ ఘనంగా జరిగింది.
మంత్రి లోకేశ్ (Nara Lokesh), బ్రాహ్మణి (Bramhani) తనయుడు దేవాన్ష్ (Nara Devaansh) నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ నివాసంలో నారా, నందమూరి కుటుంబసభ్యుల నడుమ వేడుకగా జరిగింది.
సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (Nara Chandrababu Naidu) దంపతులు, హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ (Nandamuri Balakrishna) దంపతులు, వారి తనయుడు, దేవాన్ష్ మేనమామ మోక్షజ్ఞ (Mokshagna Teja) పాల్గొన్నారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నందమూరి, నారా అభిమానులతో పాటు నెటిజన్లు దేవాన్ష్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదాలు అందజేస్తున్నారు.