అలా విడాకులు.. ఇలా రెండో పెళ్లి

ABN , Publish Date - Mar 06 , 2026 | 05:28 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది చాలామంది పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ పెళ్ళిపీటలు ఎక్కగా.. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా త్వరలోనే పెళ్ళికి సిద్ధమవుతున్నారు.

Tharun Bhascker

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది చాలామంది పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ పెళ్ళిపీటలు ఎక్కగా.. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా త్వరలోనే పెళ్ళికి సిద్ధమవుతున్నారు. వీరు కాకుండా మరో జంట కూడా పెళ్ళికి సిద్దమవుతోన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వారే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), హీరోయిన్ ఈషా రెబ్బ (Eesha Rebba). పెళ్ళిచూపులు సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో యువతకు మరింత దగ్గరయ్యారు.

తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా కన్నా ఎక్కువ నటుడిగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్యనే ఆయన నటించిన చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. ఇక ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ ఈషా రెబ్బతో తరుణ్ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. తరుణ్ సైతం ఈ వార్తలను కొట్టిపారేయకుండా సమయం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పడం మరింత అనుమానాలకు దారితీసింది. అంతేకాకుండా విరోష్ వెడ్డింగ్ కి కూడా వీరిద్దరూ జంటగానే వెళ్లివచ్చారు.

అందుతున్న సమాచారం ప్రకారం తరుణ్ - ఈషా త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తరుణ్ కి ఇంతకుముందే లతా నాయుడుతో వివాహం జరిగింది. కొన్నేళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట విభేదాల వలన విడిపోయారు. విడివిడిగా ఉంటున్నా వీరు ఇంకా విడాకులు తీసుకోకపోవడంతో తరుణ్.. ఈషాను రెండోపెళ్ళి చేసుకోవడం కుదరడం లేదు. దీంతో ఈ మధ్యనే తరుణ్ విడాకులకు అప్లై చేసారని, అతి త్వరలోనే వీరి విడాకులు మంజూరు కానున్నాయని టాక్. అలా విడాకులు రాగానే తరుణ్ ఇలా ఈషా రెబ్బను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. మరి త్వరలోనే ఈ జంట కూడా శుభవార్త చెప్తుందేమో చూడాలి.

Updated Date - Mar 06 , 2026 | 05:30 PM