Trisha: ఈ వయస్సులో డ్రామాలు.. సిగ్గుచేటు
ABN, Publish Date - Aug 11 , 2026 | 08:46 PM
ఈమధ్య కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఏం చేసినా నిమిషాల్లో వైరల్ గా మారుతోంది. ఆమె మాట్లాడినా సేన్సెషనే.. మాట్లాడకపోయినా సేన్సెషనే. మొన్నటి వరకు విజయ్ పార్టీలో ఆమెకు కూడా పదవి దక్కుతోందని అందరూ భావించారు.
ఈమధ్య కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) ఏం చేసినా నిమిషాల్లో వైరల్ గా మారుతోంది. ఆమె మాట్లాడినా సేన్సెషనే.. మాట్లాడకపోయినా సేన్సెషనే. మొన్నటి వరకు విజయ్ పార్టీలో ఆమెకు కూడా పదవి దక్కుతోందని అందరూ భావించారు. అంతేనా త్రిష - విజయ్ పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై విజయ్ కానీ, త్రిష కానీ నోరు మెదిపింది లేదు. దీంతో త్వరలోనే త్రిష పెళ్లి అయిపోతుంది అనుకున్నారు. కానీ, ఇంతలోనే పెద్ద ట్విస్ట్. విజయ్ తో విడాకులు వద్దంటూ సంగీత కేసును వెనక్కి తీసుకుంది. ఇక విజయ్ - సంగీత కలిసి ఉంటే త్రిష పరిస్థితి ఏంటి.. ప్రేస్తుతం కోలీవుడ్ ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇక ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ.. ఏదో ఒక పోస్ట్ పెట్టే త్రిష కూడా సడెన్ గా సైలెంట్ గా మారింది. తాజాగా త్రిష పెట్టిన క్రిప్టిక్ పోస్ట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రముఖ రచయిత డానియెల్ చిడియాక్ రాసిన కోట్ను పంచుకుంటూ, ఆలోచిస్తున్నట్లు ఉన్న ఎమోజీని జోడించింది. అందులో 'ఈ వయసులో డ్రామాలు చేయడం నిజంగా సిగ్గుచేటు... పోయి నాలుగు రాళ్ళు సంపాదించుకుని ప్రశాంతతను వెతుక్కోండి' అంటూ రాసి ఉంది. అయితే ఆమె ఈ కోట్ పెట్టడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఎవరికి తెలియలేదు.
ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో, త్రిష ఎవరికి కౌంటర్ ఇచ్చారనే దానిపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల తనపై గానీ, తన పర్సనల్ లేదా ప్రొఫెషనల్ లైఫ్పై గానీ పరోక్ష వ్యాఖ్యలు చేసిన ప్రముఖులకు ఇచ్చి పడేసేలా త్రిష ఈ ఘాటు కౌంటర్ ఇచ్చిందని కొందరు అంటుండగా.. మరికొందరు విజయ్తో ముడిపెడుతూ తన పేరును అనవసర విషయాల్లోకి లాగుతూ సోషల్ మీడియాలో డ్రామాలు క్రియేట్ చేసే హేటర్స్, ట్రోలర్లను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని అభిప్రాయపడుతున్నారు. మరి త్రిష.. విజయ్ పార్టీలోకి వెళ్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.