పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కొమరం పులి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నికీషా పటేల్కు.. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ని ఇవ్వలేదు. ఆ సినిమా తర్వాత ఒకటెండు సినిమాలలో కనిపించినప్పటికీ, సక్సెస్ రాకపోవడంతో అవకాశాలు రాక, కేవలం సోషల్ మీడియాకే పరిమితమైంది. తాజాగా ఆమె ఇన్స్టా వేదికగా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.