నా మాటలను వక్రీకరించారు: ట్రోలింగ్పై అనసూయ సంచలన పోస్ట్
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:39 PM
ఇటీవల హిందూ ధర్మం, నినాదాల దుర్వినియోగంపై తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపి, సోషల్ మీడియాలో ట్రోలింగ్కు దారితీయడంతో నటి అనసూయ భరద్వాజ్ స్పందించారు.
ఇటీవల హిందూ ధర్మం, నినాదాల దుర్వినియోగంపై తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపి, సోషల్ మీడియాలో ట్రోలింగ్కు దారితీయడంతో నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) స్పందించారు. ఈ వివాదంపై పూర్తి స్పష్టతనిస్తూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన వివరణాత్మక పోస్ట్ను షేర్ చేశారు. కొందరు కావాలనే తన వ్యాఖ్యల నుంచి అసలు సందర్భాన్ని తొలగించి, సనాతన ధర్మాన్ని అవమానించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాను సనాతన ధర్మాన్ని నిష్టగా పాటించే హిందువునని, హనుమంతుడి భక్తురాలినని అనసూయ స్పష్టం చేశారు. తనపై ఆన్లైన్లో అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ, వ్యక్తిగత దాడులకు దిగుతున్న వారిని ఉద్దేశించే మాట్లాడాను తప్ప, ఏ మతాన్నో లేదా వర్గాన్నో కించపరచడం నా ఉద్దేశం కాదని అన్నారు. నిజం వైపు నిలబడటం, తప్పును ప్రశ్నించడం, ఎదుటివారిని గౌరవించడం నా ధర్మమే నాకు నేర్పిందని స్పష్టం చేశారు. హనుమంతుడి ధైర్యమే నాకు కొండంత బలమని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు, సగం సగం చూసే కథనాలను నమ్మి తనపై దుష్ప్రచారం చేయవద్దని నెటిజన్లను కోరారు. పూర్తి వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని హితవు పలికారు. ‘జై శ్రీరామ్.. జై హనుమాన్’ అంటూ ఆమె పెట్టిన ఈ క్లారిఫికేషన్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
అనసూయ తన పోస్ట్ విషయానికి వస్తే.. ‘‘నా మాటలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారు. అందుకే ఈ వివరణ ఇవ్వాల్సి వస్తోంది. నేను మాట్లాడింది నాపై అసభ్య కామెంట్లు చేస్తూ, వ్యక్తిగత దాడులు, బెదిరింపులకు దిగే కొంతమంది వ్యక్తుల గురించి మాత్రమే. అది ఏ మతాన్ని గానీ, వర్గాన్ని గానీ ఉద్దేశించి చెప్పిన మాట కాదు. నన్ను టార్గెట్ చేస్తున్న వాళ్లకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.. నేను సనాతన ధర్మాన్ని పాటించే హిందువుని. నా ధర్మం, నా విలువలు, విశ్వాసాల పట్ల నాకు ఎలాంటి సందేహం లేదు. ధైర్యంగా ఉండటం, నిజం వైపు నిలబడటం, తప్పును తప్పు అని చెప్పడం, ఎదుటివారిని మనిషిగా గౌరవించడం.. ఇవన్నీ నాకు నా ధర్మమే నేర్పింది. నన్ను నేను హనుమాన్ జీ కుమార్తెగా భావిస్తాను. హనుమాన్ జీ ఇచ్చే ధైర్యం, బలమే నాకు స్ఫూర్తి. అందువల్లే అన్యాయం జరిగినప్పుడు నేను మౌనంగా ఉండలేను. నా మాటల నుంచి అసలు సందర్భాన్ని తొలగించి, సనాతన ధర్మాన్ని అవమానించినట్లుగా తప్పుదోవ పట్టించి ప్రచారం చేయడం ఎంతమాత్రం సరికాదు. నేను మతం ఆధారంగా ఎవరినీ తప్పుపట్టను, వేధించే ప్రవర్తనను మాత్రమే ప్రశ్నిస్తాను. కాబట్టి ఎడిట్ చేసిన క్లిప్పులు, సగం సగం కథనాల వలలో పడకండి. పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాతే ఒక అభిప్రాయానికి రండి. నా నమ్మకం మీద నాకు గర్వం ఉంది. నా సనాతన ధర్మ మీద నాకు గర్వం ఉంది. నేను హిందువుని అని చెప్పుకోవడంలో నాకు ఎలాంటి సంకోచం లేదు. అదే సమయంలో ఎవరు ఏ మతానికి చెందిన వారైనా వేధింపు వేధింపే.. అగౌరవం అగౌరమే. Jai Shree Ram, Jai Hanuman’’ అని రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
‘జార్జ్ క్రిష్’.. శ్రీను వైట్లకు శర్వానంద్ అయినా హిట్ ఇస్తాడా
మహేష్ బాబు కాదా.. బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ మెగాస్టార్తోనా?
డీపీ మార్చిన రెబల్ స్టార్.. ఇక అంతా ‘ఫౌజీ’ గురించే!