సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పాన్ మసాలా యాడ్‌.. లెక్క‌లు తేల్చండి! షారుఖ్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు ఫుడ్ సేఫ్టీ నోటీసులు

ABN, Publish Date - Aug 17 , 2026 | 09:46 PM

పాన్ మసాలా ప్రకటన విషయంలో షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Shah Rukh Khan

ప్రముఖ బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), అజయ్ దేవగణ్ (Ajay Devgn), టైగర్ షాఫ్ (Tiger Shroff)ల‌కు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (Maharashtra FDA, Food Safety Department) షో కాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో నిషేధిత ఉత్పత్తి అయిన పాన్ మసాలా (Pan Masala Advertisement)ను ఓ ప్రకటన ద్వారా వీరు పరోక్షంగా ప్రచారం చేసినందుకుగానూ ఈ చర్యలు చేపట్టింది.

పాన్ మసాలా ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని, సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆ కంటెంట్‌ను తొలగించాలని వారిని ఆదేశించింది. వీటికి సంబంధించి జరిగిన ఒప్పందాలు, చెల్లింపుల వ్యవహారాలను తెలియజేయాలని పేర్కొంది. తొలుత షారుఖ్. అజయ్ పాటు అక్షయ్ కూడా ఈ యాడ్‌కు సైన్ చేశారు. కానీ, పొగాకు ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నటుందనే విమర్శలు రావడంతో అక్షయ్ ఈ యాడ్ నుంచి తప్పుకున్నారు.

నా మనస్సాక్షి అంగీక‌రించ‌దు: సన్నీ డియోల్

పాన్ మసాలా యాడ్స్ తాను నటించనంటూ సన్నీడియోల్ (Sunny Deol) స్పష్టం చేశారు. ఆ ఉత్పత్తులు మంచివని తాను అనుకోవడం లేదని, విశ్వసించని విషయాలను ప్రచారం చేయడానికి తన మనస్సాక్షి అంగీకరించదని అన్నారు. భవిష్యత్తులోనూ వాటికి దూరంగా ఉంటానని పేర్కొన్నారు.

Updated Date - Aug 17 , 2026 | 10:35 PM