Pahlaj Nihalani: ప్రముఖ నిర్మాత.. పహ్లాజ్ నిహ్లానీ కన్నుమూత
ABN, Publish Date - Jun 05 , 2026 | 06:43 AM
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, సెన్సార్ బోర్డ్ మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ (76) కాలేయ వ్యాధితో కన్నుమూశారు.
ప్రముఖ నిర్మాత, సెన్సార్ బోర్డ్ మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ (76) (Pahlaj Nihalani) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు.
‘ఆంఖేన్’, ‘అందాజ్’, ‘తలాష్’, ‘రంగీలా రాజా’, ‘జూలీ 2’ వంటి చిత్రాలను పహ్లాజ్ నిర్మించారు. ఇక 2015 -17 మధ్య కాలంలో సెన్సార్ బోర్డ్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు.
ఈ సందర్భంలో పహ్లాజ్ పలు కీలక నిర్ణయాలు తీసుకుని నిర్మాతలకు వణుకు పుట్టించారు. సెన్సార్ బోర్డ్ అంటే ఏమిటో, దాని పవర్ ఏమిటన్నది ఆయన తన చర్యల ద్వారా నిరూపించారు.