Aap Jaisa Koi: ఇద్దరు అధ్యాపకుల ప్రేమకథ...
ABN , Publish Date - Jun 25 , 2025 | 03:12 PM
ఆర్. మాధవన్ నటించిన హిందీ సినిమా ఆప్ జైసా కోయీ త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఫాతిమా సనా షేక్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ (R Madhavan) వైవిధ్యమైన పాత్రలను చేస్తున్నాడు. అలాగే వివిధ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా మాధవన్ నటించిన 'ఆప్ జైసా కోయీ' (Aap Jaisa Koi) మూవీ నెట్ ఫ్లిక్స్ లో జూలై 11 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది.
మాధవన్ సరసన 'ఆజ్ జైసా కోయీ' మూవీలో ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh) హీరోయిన్ గా నటిస్తోంది. సంస్కృత ఉపాధ్యాయుడు శ్రీరేణు త్రిపాఠిగా మాధవన్ నటిస్తుంటే... ఫ్రెంచ్ టీచర్ మధు బోస్ పాత్రను ఫాతిమా చేస్తోంది. 42 సంవత్సరాలు వచ్చినా పెళ్ళి కానీ శ్రీరేణు 32 సంవత్సరాల మధు మధ్య జరిగిన పెళ్ళి చూపులు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా సాగబోతోంది. తాజాగా మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సంప్రదాయ కుటుంబానికి చెందిన హీరో, విశాల భావాలు కలిగిన హీరోయిన్ కుటుంబానికి మధ్య ఏర్పడి అగాధం వీరిద్దరినీ ఎలా దూరం చేసిందనే దానిని ఆసక్తికరంగా ఈ ట్రైలర్ లో చూపించారు. వివేక్ సోనీ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. అయేషా రజా, మనీష్ చౌదరి, నమిత్ దాస్ ఇందులో ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అదర్ పూనావాలా, అపూర్వ మెహతా, సోనెమ్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు.
Also Read: Sreeleela: తప్పుకుందా... తప్పించారా...
Also Read: Vijay Antony: ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం కొత్తేమి కాదు.. శ్రీకాంత్ అరెస్ట్ పై విజయ్ స్పందన