Andhra King Taluka: సినిమా సెట్ లోకి వెళ్ళి పాట పాడేసి ఫ్యాన్...
ABN, Publish Date - Oct 31 , 2025 | 06:47 PM
శర్వానంద్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న సినిమా 'ఆంధ్రా కింగ్ తాలూకా'. ఉపేంద్ర స్టార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మహేశ్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. వివేక్, మార్విన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమానుండి తాజాగా 'చిన్ని గుండెలో...' అనే పాట విడుదలైంది. కృష్ణకాంత్ రాసిన ఈ యుగళ గీతాన్ని మార్విన్ సోలోమన్, సత్య యామని పాడారు. ప్రియురాలి కోరిక మేరకు సినిమా సెట్ లోకి వెళ్ళిపోయి కథానాయకుడు పాడుకునే పాటగా దీనిని దర్శకుడు మహేశ్ బాబు చిత్రీకరించాడు. 'ఆంధ్రా కింగ్ తాలూకా' మూవీ నవంబర్ 28న జనంముందుకు రాబోతోంది.