Maargan: నేనంటే ఇష్టమని చెప్పమంటున్న విజయ్ ఆంటోని!
ABN, Publish Date - Jun 14 , 2025 | 04:01 PM
విజయ్ ఆంటోని తాజా చిత్రం 'మార్గన్' ఈ నెల 27న జనం ముందుకు రాబోతోంది. ఇందులో తాజా గీతం 'చెప్పవమ్మా'కు విజయ్ ఆంటోని స్వరాలు సమకూర్చి, తానే పాడారు.
ప్రముఖ సంగీత దర్శకుడు, కథానాయకుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) తాజా చిత్రం 'మార్గన్' (Maargan). జూన్ 27న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ మర్డర్ మిస్టరీ క్రైమ్ థిల్లర్ లో విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ దిషాన్ విలన్ గా నటిస్తుండటం విశేషం. ఈ సినిమాను ప్రముఖ ఎడిటర్ లియో జాన్ పాల్ (Leo John Paul) డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన ఈ సినిమాకు ఎడిటర్ గానూ వర్క్ చేస్తున్నారు. అలానే విజయ్ ఆంటోని ఈ మూవీకి స్వరాలు సమకూర్చుతున్నారు. ఆయన భార్య మీరా విజయ్ ఆంటోనీ దీనిని నిర్మిస్తోంది. నటుడు, నిర్మాత, దర్శకుడు, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్ గా వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వహించడం విజయ్ ఆంటోనికి అలవాటే. ఈ సినిమా నుండి తాజాగా 'చెప్పవమ్మా... చెప్పవమ్మా' అనే గీతం విడుదలైంది. ఈ పాటను భాష్యశ్రీ (Bhashya Sree) రాయగా, విజయ్ ఆంటోని స్వరపర్చి, తానే పాడారు. ప్రస్తుతం ఈ పాట యూ ట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. సముతిరకని, మహానది శంకర్, ప్రీతిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ఘోష్, దీప్సిఖ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.