సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Virgin boys: టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు,వర్జిన్ బాయ్స్ ఆఫర్

ABN, Publish Date - Jul 05 , 2025 | 08:05 PM

రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ గడ్డం దర్శకత్వంలో జులై 11న  ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం 'వర్జిన్ బాయ్స్'. మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రదారులు.

రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ గడ్డం దర్శకత్వంలో జులై 11న  ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం 'వర్జిన్ బాయ్స్' (virgin boys) మిత్ర శర్మ(mithra sharma), గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రదారులు. ఈ  చిత్ర ట్రైలర్ ను  హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ విడుదల చేశారు.  జరిగింది.  ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్ గా ఇస్తామని ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర బృందం తెలిపింది. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో కొన్ని థియేటర్లలో డబ్బు మీపై వర్షంలో కురిసి ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అంటూ తెలిపారు. 


నిర్మాత రాజా దారపునేని మాట్లాడుతూ "వర్జిన్ బాయ్స్ అనే టైటిల్ ఖచ్చితంగా సూట్ అయ్యే టైటిల్. ఇప్పటికే విడుదలైన టీజర్, ఒక పాట ఎంతో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో పెద్దవారు ఎవరూ లేరు. అయినా ఈ సినిమాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ థాంక్స్. ఎన్నో సర్ప్రైజ్ లతో ఈ సినిమాతో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము" అన్నారు.

దర్శకుడు దయానంద మాట్లాడుతూ "మేము కాలేజీ రోజుల్లో ఉండగా చేసిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా మొదలు పెట్టడం జరిగింది. ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అందరికీ కనెక్ట్ అవుతాయి. చిత్రానికి చాలా మంచి బృందం నాకు లభించినందుకు సంతోషంగా ఉంది. స్మరణ్ సాయి సంగీతం ఈ చిత్రానికి బోనస్ గా నిలుస్తుంది. మా అన్నయ్య గీతానంద్ తో నాకు ఇది రెండవ చిత్రం. గీతానంద్, మిత్ర శర్మ మధ్య సీన్లు అద్భుతంగా వచ్చింది" అని అన్నారు

నటుడు గీతానంద్ మాట్లాడుతూ " మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.. ఈ సినిమా ప్రేక్షకులని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ఎంతో కష్టపడి ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాని పూర్తి చేసాము. శ్రీహన్ వల్ల సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకు తర్వాత అందరికీ మంచి అవకాశాలు వస్తాయి. మిత్ర శర్మ ఈ సినిమాలో అద్భుతంగా పెర్ఫాం చేశారు. తన రోల్ సాధారణమైనది కాదు. అటువంటి రోల్ చేయాలంటే ఎంతో మెచ్యూరిటీ ఉండాలి. ఈ సినిమా యూత్ కు బయోపిక్ లాంటిది. నిజమైన సంతోషం మందు, మత్తు పదార్థాలలో ఉండదు. మనం ఏదైనా సాధించినప్పుడు వస్తుంది. ఈ సినిమా చూశాక ఎంత సంతృప్తితో బయటకు వెళ్తారు. జూలై 11వ తేదీన ఈ సినిమా తప్పకుండా థియేటర్లో చూడండి" అన్నారు.

నటి మిత్ర శర్మ మాట్లాడుతూ "ఈ సినిమాలో నా క్యారెక్టర్ కొంచెం కొత్తగా అనిపించింది. అవకాశం ఇచ్చినందుకు దయానంద్ కు థాంక్స్. ఏదైనా సాధించాలి అనే సంకల్పంతో ముందుకు వచ్చాడు. తన కష్టం వల్లే మేము ఈరోజు ఈ స్టేజి మీద ఉన్నాము. రోనిత్ ఎంతో మంచి పర్ఫార్మెన్స్ చేశారు. చిత్రంలో ఇతని క్యారెక్టర్ బాగా అనిపిస్తుంది.  శ్రీహాన్ చేసిన క్యారెక్టర్ లేకపోతే సినిమాలో కిక్ ఉండదు. సినిమా చూసిన తర్వాత శ్రీహాన్ చేసిన క్యారెక్టర్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. గీతానంద్ తో సైలెంట్ గా ఉండే వ్యక్తి, బాగా సపోర్ట్ చేస్తారు.  నిస్వార్థమైన వ్యక్తి" అని  అన్నారు. 

స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. బబ్లు, కౌశల్ మంద, ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.   

Updated Date - Jul 05 , 2025 | 10:29 PM