అందుకే ఆలస్యం
ABN, Publish Date - Jul 02 , 2025 | 04:15 AM
చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తోన్న సోషియో ఫ్యాంటసీ ‘విశ్వంభర’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి...
చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తోన్న సోషియో ఫ్యాంటసీ ‘విశ్వంభర’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడొస్తుందనేది ఓ ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఆంగ్ల మీడియాతో మాట్లాడిన దర్శకుడు వశిష్ఠ, సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. ‘‘విశ్వంభర’ ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తైంది. సినిమా ఒక విజువల్ వండర్లా ఉంటుంది. ఆ అనుభూతినిచ్చేందుకే వీఎ్ఫఎక్స్ పనులు జరుగుతున్నాయి. వాటి నాణ్యత విషయంలో అస్సలు రాజీపడడం లేదు. అందుకే ఆలస్యం అవుతోంది. ఈ పనులు ఓ కొలిక్కి వచ్చాకే విడుదల తేదీపై స్పష్టతనిస్తాం. సినిమాలో అత్యధికంగా 4676 వీఎ్ఫఎక్స్ షాట్స్ ఉన్నాయి. అవి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటాయి. ప్రపంచస్థాయి క్వాలిటీని అందివ్వడానికి టాప్ వీఎ్ఫఎక్స్ కంపెనీలు పనిచేస్తున్నాయి. చిరంజీవి ఇప్పటివరకూ చేసిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల అవుట్పుట్ చూసి థ్రిల్లయ్యారు’’ అని అన్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్నారు.