Suspense Thriller: మిస్టీరియస్ పోస్టర్ లాంచ్
ABN, Publish Date - Jun 17 , 2025 | 02:25 AM
రోహిత్ సహాని, అబిద్ భూషణ్, రియా కపూర్, మేఘనా రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘మిస్టీరియస్’ చిత్రం టైటిల్ పోస్టర్ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు.
రోహిత్ సహాని, అబిద్ భూషణ్, రియా కపూర్, మేఘనా రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘మిస్టీరియస్’ (Miss Terious) చిత్రం టైటిల్ పోస్టర్ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata Reddy) విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు.
చిత్ర దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘మిస్టీరియస్ చిత్రాన్ని ప్రతి పాత్ర అనుమానాస్పదంగా ఉండేలా, సస్పెన్స్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేసేలా నిర్మించాం. చిత్రకథ, స్క్రీన్ ప్లే సునిశితంగా రూపొందించిన ఈ చిత్రం క్రమక్రమంగా క్లూలను బహిర్గతం చేస్తూ ప్రేక్షకులను చివరి వరకు ఉత్సాహంగా ఉంచుతుంది. ఈ చిత్రం షాకింగ్ ట్విస్ట్ లు కథను కొత్త ఎత్తులకు తీసుకెళ్ళి వీక్షకులను రంజింప చేస్తుంది, యాక్షన్స్, థ్రిల్లింగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి' అని చెప్పారు.
చిత్ర నిర్మాత జయ్ వల్లందాస్ (అమెరికా) మాట్లాడుతూ ‘ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించాం. ఇందులో మూడు పాటలున్నాయి. ఇక్కడ నుండి వారానికి ఒక పాట చొప్పున విడుదల చేస్తాం. ఎం.ఎల్. రాజా మంచి సంగీతాన్ని అందించారు. సినిమాను ఆదరించాలని కోరుతున్నాను’ అని అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ్ ఉప్పు.