సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చిటికేసి తిరిగి చూసేలా చేసే అస్త్రం

ABN, Publish Date - Jun 26 , 2025 | 02:06 AM

అభ్యుదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ తాజా చిత్రం పోలీ్‌సవారి హెచ్చరిక. బెల్లి జనార్థన్‌ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను బుధవారం తన కార్యాలయంలో హీరో...

అభ్యుదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ తాజా చిత్రం ‘పోలీ్‌సవారి హెచ్చరిక’. బెల్లి జనార్థన్‌ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను బుధవారం తన కార్యాలయంలో హీరో సుధీర్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘దర్శకుడు బాబ్జీ మా మామ కృష్ణగారికి సన్నిహితులు. ఆయన అభిమానులకు సుపరిచితుడు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం టీజర్‌ను నేను విడుదల చేయడం ఆనందంగా ఉంది. టీజర్‌ అంటే రకరకాల వ్యాపకాలతో, మూడ్స్‌తో ఉండే ప్రేక్షకులను చిటిక వేసి మనవైపు తిరిగి చూసేలా చేసే అస్త్రం. ‘పోలీ్‌సవారి హెచ్చరిక’ అస్త్రం కూడా చాలా ఆకర్షణీయంగా, రిచ్‌గా ఉంది’ అన్నారు. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ ‘నేను ఏ సినిమా చేసినా దానికి సంబంధించిన ఏదో ఒక కార్యక్రమాన్ని కృష్ణగారి చేతుల మీదుగా నిర్వహించేవాడిని. ఇప్పుడు ఆయన మనమధ్య లేకపోయినా వారి అల్లుడు సుధీర్‌బాబు టీజర్‌ను విడుదల చేసి ఆ లోటు తీర్చారు’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బెల్లి జనార్థన్‌, హీరో సన్నీ అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - Jun 26 , 2025 | 02:06 AM