Chinmayi: నా పిల్లలు చనిపోవాలని కోరుకుంటున్నారు.. చిన్మయి, రాహుల్ దంపతులపై సోషల్ మీడియాలో తిట్లు
ABN, Publish Date - Nov 07 , 2025 | 06:02 AM
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తనపై, తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన కామెంట్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్కు ఫిర్యాదు చేశారు.
తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో పలువురు దారుణమైన కామెంట్లు పెడుతున్నారని ప్రముఖ సినీ నేపథ్య గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) గురువారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (V C Sajjanar) కు 'ఎక్స్' ద్వారా ఫిర్యాదు చేశారు. అందుకు సంబందించిన కొన్ని స్క్రీన్ షాట్లను ఫిర్యాదుతో జత చేశారు. 'మహిళల గురించి వాళ్లు ఉపయోగిస్తున్న భాష దారుణంగా ఉంది. వారి వేధింపులతో విసిగిపోయాను. మా అభిప్రాయాలు నచ్చకపోతే వాటిని పట్టించుకోవద్దు' వదిలేయండి కానీ మా పిల్లలు చనిపోవాలని వారు కోరుకోవడం దారుణం. అందుకే మీ దృష్టికి తీసుకొస్తున్నా అని ఆమె పేర్కొన్నారు. దీనిపై సజ్జనార్ వెంటనే స్పందించారు. చిన్మయి ఫిర్యాదును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ నేపథ్యం..
రాహుల్ (Rahul) దర్శకత్వం వహించిన 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girlfriend Movie) చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఆ సినిమా ప్రమోష న్ కార్యక్రమాల్లో ఒకదాంట్లో ఆయన.. నేను మహిళా పక్షపాతిని, వారికి స్వేచ్ఛను ఇవ్వాలనుకునే వాడిని, పెళ్లి తర్వాత మహిళలు తప్పనిసరిగా తాళి ధరించాలనే సంప్రదాయాన్ని నేను సమర్ధించను' అని వ్యాఖ్యానించారు. మంగళ సూత్రం ధరించాలంటూ తన భార్య చిన్మయిని తానెప్పుడూ బలవంతం చేయ లేదన్నారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. కొందరు ఆయన్ను సమర్థించారు. మరికొందరు విమర్శించారు. దీంతో చిన్మయి రాహుల్కు మద్దతుగా 'ఎక్స్' ఒక పోస్టు పెట్టారు.
'మంగళసూత్రం మహిళలపై లైంగిక వేధింపులను, లైంగిక దాడులను ఆపలేదు. పుట్టుక నుంచి మరణించే వరకు ఈ సమాజంలో మహిళలకు ఏ దశలోనూ భద్రత లేదు. చాలా చోట్ల మృతదేహాలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అప్పుడే పట్టిన పసికందులపై దారుణాలు ఆగడం లేదు కదా? అని ఆ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నెటిజన్లు రాహుల్- చిన్మయి దంపతులను తీవ్రంగా విమర్శించారు. 'ఇలాంటి వారికి పిల్లలు పుట్టకూడదు.. పుట్టినా వెంటనే చనిపో వాలి" అని కామెంట్స్ చేశారు. రాయడానికి వీలుకాని తీవ్రమైన అసభ్య పదజాలంతో చిన్మయిని దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపా నికి గురైన చిన్మయి సజ్జనార్కు ఫిర్యాదు చేశారు.