సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రేక్షకులకు నచ్చే సినిమాలే చేస్తా

ABN, Publish Date - Jun 25 , 2025 | 05:30 AM

నవీన్‌ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా మదన్‌ దక్షిణామూర్తి తెరకెక్కించిన చిత్రం ‘షోటైం’. అనిల్‌ సుంకర సమర్పణలో కిషోర్‌ గరికపాటి నిర్మించారు....

నవీన్‌ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా మదన్‌ దక్షిణామూర్తి తెరకెక్కించిన చిత్రం ‘షోటైం’. అనిల్‌ సుంకర సమర్పణలో కిషోర్‌ గరికపాటి నిర్మించారు. జూలై 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నవీన్‌ చంద్ర మాట్లాడుతూ ‘నాకు తెలిసింది సినిమా ఒక్కటే. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమాలనే చేస్తా’ అని చెప్పారు. హీరోయిన్‌ కామాక్షి మాట్లాడుతూ ‘చిన్న సినిమానే కానీ, ఇందులో మంచి కంటెంట్‌ ఉంటుంది’ అని తెలిపారు. చిత్రదర్శకుడు మదన్‌ దక్షిణామూర్తి మాట్లాడుతూ ‘పరిశ్రమలో ఒక పెద్దాయన ఈ సినిమా చూసి రియల్‌ షో టైం అని అన్నారు. దాంతో సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం కలిగింది’ అని అన్నారు. కాగా, ఈ సినిమాలో ఒక హత్య చుట్టూ కథ సాగుతుందని ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతోంది.

Updated Date - Jun 25 , 2025 | 05:30 AM