Rajendra Prasad: మే 30న రాజేంద్ర ప్రసాద్ షష్టిపూర్తి
ABN , Publish Date - May 06 , 2025 | 04:33 PM
రాజేంద్ర ప్రసాద్, అర్చన జంటగా నటించిన 'షష్టిపూర్తి' సినిమా ఈ నెల 30న జనం ముందుకు వస్తోంది. ఇందులో యువ జంటగా రూపేష్, ఆకాంక్ష సింగ్ నటించారు.
రూపేష్ (Rupeysh), ఆకాంక్ష సింగ్ (Aakanksha Singh) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'షష్టిపూర్తి' (Shashtipoorthi). ఈ సినిమాతో పవన్ ప్రభ దర్శకునిగా పరిచయ మవుతున్నారు. ‘మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్‘ పతాకం పై రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 30 న విడుదల చేయనున్నారు.
ఈ సందర్బంగా దర్శక నిర్మాతలు పవన్ ప్రభ , రూపేష్ మాట్లాడుతూ, “ ఈ సినిమాకి ఎందరో హేమాహేమీలు పని చేశారు. అభినయంలో ఆరితేరిన రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), అర్చన (Archana) ఈ సినిమాకు మెయిన్ అస్సెట్. ఇక ఇళయరాజా (Ilaiyaraaja) స్వరాల వల్ల మా చిత్రానికి ప్రేక్షకుల్లో గొప్ప అటెన్షన్ వచ్చింది. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు టాప్ లిస్ట్ లో ఉన్నాయి. మళ్లీ విoటేజ్ ఇళయరాజాను వింటున్నామని అందరూ ప్రశంసిస్తున్నారు. ‘ఏదో ఏ జన్మలోదో ..’ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani) సాహిత్యం అందించడం మా అదృష్టం. రెహమాన్ రచించిన ‘ఇరు కనులు కనులు కలిసి మురిసె‘ పాటను ఎస్పి చరణ్ , విభావరి ఆలపించారు. ఎక్కడ విన్నా ఈ పాటలే వినిపిస్తున్నాయి. ఈ పాటల కారణంగా ప్రేక్షకుల్లోనే కాకుండా , బిజినెస్ సర్కిల్స్ లో కూడా మా సినిమాపై స్పెషల్ అటెన్షన్ వచ్చింది. అలాగే ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అవుట్ పుట్ కూడా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఈ సమ్మర్ కి మంచి ఫీల్ గుడ్ మూవీ తో వీడ్కోలు చెప్పవచ్చు. మిగిలిన 3 పాటలను , ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేస్తాం“ అని తెలిపారు.
Also Read: Sreeleela: బ్యాక్లెస్ ఫొటోలతో ‘శ్రీలీల’! ఈ టాలెంట్ కూడా ఉందా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి