సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ABN, Publish Date - Jun 22 , 2025 | 02:03 PM

టాలీవుడ్ స్టార్‌ హీరో విజయ్ దేవరకొండపై తెలంగాణ హైవ‌రాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

vijay

టాలీవుడ్ స్టార్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)పై తెలంగాణ హైవ‌రాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రెట్రో (Retro) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టే, ఇప్పుడు ఇండియా,పాకిస్తాన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయని ఆదివాసులపై విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో ఆయనపై ఈ కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘాలు ఆరోపిస్తూ ఆయ‌న‌పై చర్యలు తీసుకోవాలని ఆదివాసులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేయడంతో పాటు అనేక చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో న‌మోదైన‌ ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇప్పుడీ వార్త టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

మే1న త‌మిళ‌ స్టార్ హీరో సూర్య (Suriya) న‌టించిన‌ రెట్రో సినిమా విడుద‌ల నేప‌థ్యంలో ఏప్రిల్‌ నెల 26న నిర్వ‌హించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. అదే స‌మ‌యంలో పెహాల్గాం ఉగ్ర దాడికి సంబంధించిన వార్త‌లు ప‌తాక స్థాయిలో ఉన్న నేప‌థ్యంలో ఆ ఉగ్ర‌దాడిని ఖండిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. 'పాకిస్తాన్ మీద ఇండియా ఎటాక్ చేయాల్సిన పనే లేదని.. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం మీద ఎటాక్ చేస్తారన్నారు. కరెంట్, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే.. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా పని లేకుండా కొట్లాడుతారన్నారు. మనమంతా సమష్టిగా కలిసి ఉండాలి' అని అన్నారు.

ఇప్పుడ‌వే వ్యాఖ్య‌లు ఆదివాసులను అవమానించేలా ఉన్నాయంటూ ట్రైబల్స్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ బాపూనగర్‌ అధ్యక్షుడు కిషన్‌రాజ్‌ చౌహాన్‌ కిషన్ సహా గిరిజన సంఘాలు తప్పుబట్టాయి. ఈ కామెంట్స్ ఆదివాసీల సంస్కృతి, జీవన విధానాన్ని అవమానించేలా ఉన్నాయని వారు ఆరోపించారు. హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ఆ కేసు న‌మోదు చేశారు. త‌ర్వాత ఏం జ‌రుగ‌బోతుంద‌నే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మ‌రింది. ఇదిలాఉంటే విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన కింగ్‌డ‌మ్ (Kingdom) చిత్రం ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉండ‌గా వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. జూలై చివ‌రి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Updated Date - Jun 22 , 2025 | 02:17 PM