సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Santhana Prapthirasthu: ఫర్టిలిటీ సెంటర్స్ నుంచే సంతాన ప్రాప్తిరస్తు షురూ అయింది

ABN, Publish Date - Oct 27 , 2025 | 05:21 PM

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'.  మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. 

విక్రాంత్(vikranth), చాందినీ చౌదరి (Chandini Chowdary) జంటగా నటిస్తున్న సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'(Santhana Prapthirasthu).  మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.  సంజీవ్ రెడ్డి దర్శకుడు. నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సోమవారం రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా నుంచి 'తెలుసా నీ కోసమే' లిరికల్ సాంగ్ ను నిర్మాత డి.సురేష్ బాబు రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 

మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 'అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో పెద్ద సంఖ్యలో ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఈ పాయింట్ నుంచే కథ మొదలైంది. పిల్లలు పుట్టకపోవడం అనేది బిజీ లైఫ్ లో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ గానీ ఇతర ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ల జీవితాల్లో పెద్ద సమస్యగా మారింది. గత కొన్నేళ్లుగా మన సొసైటీలో ఈ సమస్యను చూస్తున్నాం. ఈ పాయింట్ తో 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమాను ఎలాంటి వల్గారిటీ లేకుండా మంచి ఫన్, ఎంటర్ టైన్ మెంట్ తో ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించాం. మా క్లోజ్ సర్కిల్ లో సినిమా చూసిన వారంతా చాలా బాగుందని చెబుతున్నారు. చిన్న చిత్రాలకు ఉండే రిలీజ్ ప్రాబ్లమ్స్ గురించి అందరికీ తెలిసిందే.  మాకు సురేష్ ప్రొడక్షన్స్ ఉంది అనే ధైర్యంతో ముందడుగు వేస్తుంటాం. ఈసారి డిజప్పాయింట్ చేయము అని చెప్పి సురేష్ బాబు గారికి మాటిచ్చాను. ఆయనకు టీజర్, ట్రైలర్ చూపించాం.  'తెలుసా నీ కోసమే' బ్యూటిఫుల్ సాంగ్, కథలోనుంచి వచ్చిన పాట ఇది.  మరో మూడు వారాల్లో మీ ముందుకు రాబోతున్నాం' అన్నారు. 


డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ  'సమాజంలో కపుల్స్ ఎదుర్కొంటున్న సమస్య నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అయితే ఎక్కడా సందేశాలు ఇచ్చేలా సినిమా ఉండదు. ఫన్, ఎంటర్ టైన్ మెంట్ తో లైటర్ వేన్ లో మూవీ వెళ్తుంటుంది.  విక్రాంత్ మాకు బాగా సపోర్ట్ చేశాడు. తెలుసా నీకోసమే పాటను అజయ్ గారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నుంచి సాంగ్ లా కంపోజ్ చసి తీసుకొచ్చారు. హీరో హీరోయిన్స్ మధ్య ఉండే కెమిస్ట్రీ ఈ పాటలో బాగా రిఫ్లెక్ట్ అవుతుంది'  అన్నారు.


హీరో విక్రాంత్ మాట్లాడుతూ 'ఈ కథ విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కథలో నేడు సొసైటీ ఎదుర్కొంటున్న ఒక బర్నింగ్ ఇష్యూను ఎలాంటి మెసేజ్ లు ఇవ్వకుండా లైట్ హార్టెట్ గా స్క్రిప్ట్ చేశారు. పిల్లలు పుట్టిన యంగ్ కపుల్స్ సొసైటీ నుంచి ఒక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇది వారిని మానసికంగా ఇబ్బందిపెడుతుంది. అలాంటి ఎమోషనల్ కంటెంట్ కూడా ఈ మూవీలో ఉంది. ఈ సినిమాలో నా పర్ ఫార్మెన్స్ కు పేరొస్తే దానికి కారణం మా దర్శకుడు సంజీవ్ రెడ్డి.  అజయ్ అరసాడ తన బీజీఎంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. నవంబర్ 14న థియేటర్స్ లోకి వస్తున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం' అన్నారు.

స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావూద్. జి మాట్లాడుతూ 'జనాభాలో భారత్ చైనాను దాటేసింది. మనది ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. ఈ తరుణంలో  ఐవీఎఫ్, ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువగా ఎందుకు పెరిగాయి అనే పాయింట్ ను  డిస్కస్ చేస్తూ ఎంటర్ టైనింగ్ వే లో రాసుకున్న స్టోరీ ఇది.  ప్రతి ప్రేక్షకుడికి వినోదాన్ని పేచీ సినిమా అని చెప్పగలం' అని  అన్నారు.

Updated Date - Oct 27 , 2025 | 05:47 PM