సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Samantha: మనలో ఆ భావం మారితేనే.. ఏదైనా చేయగలం

ABN, Publish Date - Jun 21 , 2025 | 04:57 PM

సమంత (Samantha) సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన యాక్టివిటీస్‌తోపాటు తరచూ ఏదో ఒక అంశం గురించి పోస్ట్‌లు పెడుతుంటారు. తాజాగా సందేశాత్మకంగా ఓ పోస్ట్‌ చేశారు.


సమంత (Samantha) సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన యాక్టివిటీస్‌తోపాటు తరచూ ఏదో ఒక అంశం గురించి పోస్ట్‌లు పెడుతుంటారు. తాజాగా సందేశాత్మకంగా ఓ పోస్ట్‌ చేశారు. ఇతరుల మాటలతో మానసిక ప్రశాంతత దెబ్బ తీసుకోవద్దంటూ ఇన్‌స్టాలో స్టోరీస్‌లో రాసుకొచ్చారు. ఈ మధ్యన సమంత తరచూ వార్తలో నిలుస్తున్నారు. దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో ఆమె రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. వృత్తిపరమైన పనుల రీత్యా ఇటీవల ఆమె దుబాయ్‌కు వెళ్లారు. వెకేషన్‌ ఫొటోలను నెట్టింట షేర్‌ చేయగా ఆమెతో రాజ్‌ నిడిమోరు కూడా ఉన్నారనే కామెంట్స్‌ వచ్చాయి. మరోవైపు, రాజ్‌ సతీమణి శ్యామాలి కూడా వరుసగా పోస్ట్‌లు పెడుతున్నారు.

‘‘ఇతరుల మాటలను పట్టించుకోకుండా నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఏదైనా జరగనీ అన్నట్లు ఉంటే ప్రశాంతత రాదు.. దాని కోసం నిరంతర సాధన అవసరం. ప్రశాంతతను ఆస్వాదించాలి గానీ.. దానితో పోరాడొద్దు. జరగాల్సిన దాన్ని జరగనివ్వాలి. ‘నేను చేయాల్సింది’ అనే  భావనను ‘నేను తప్పకుండా చేయాల్సిందే’ అనే విధంగా మార్చుకోవాలి. మనసు వేగంతో కాదు.. నిశ్చలత్వంతో ప్రశాంతంగా మారుతుంది. మనం పెట్టుకునే సరిహద్దులు ఆత్మగౌరవంలో భాగమే. అంతేగానీ.. ఒత్తిళ్లు గౌరవానికి అవరోధాలు కాకూడదు. మీ శక్తిని తీసుకోవడానికి ఎవరూ అర్హులు కాదు’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడామె ఈపోస్ట్‌ ఎందుకు పెట్టిందనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Jun 21 , 2025 | 05:03 PM