Rolugunta Soori: రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా.. రోలుగుంట సూరి! ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన నట కిరిటీ
ABN, Publish Date - Oct 21 , 2025 | 09:04 PM
రియలిస్టిక్ విలేజ్ డ్రామా ‘రోలుగుంట సూరి’ ఫస్ట్ లుక్ను నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో భావోద్వేగ కథ.
గ్రామీణ నేపథ్యంలో రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న “రోలుగుంట సూరి” ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ నటుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఘనంగా ఆవిష్కరించారు. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో, నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలిపి హీరో, హీరోయిన్లుగా నటిస్తుండగా, సౌమ్య చాందిని పల్లా నిర్మిస్తున్న ఈ చిత్రం తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై రూపొందుతోంది.
ఫస్ట్ లుక్ ఆవిష్కరణ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “ఇలాంటి సినిమాలు సైలెంట్గా వచ్చి పెద్ద సంచలనం సృష్టిస్తాయి. దర్శకుడు అనిల్ కుమార్ పల్లా హృదయాన్ని తాకే సబ్జెక్ట్ని ఎంతో అందంగా చూపిస్తున్నారు. ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెస్ చేసింది. సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని నమ్ముతున్నాను” అని అన్నారు.
దర్శకుడు అనిల్ కుమార్ పల్లా మాట్లాడుతూ.. “మా సినిమా ఫస్ట్ లుక్ను ఆవిష్కరించిన రాజేంద్రప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన మాటలు మా టీమ్కి నమ్మకం, ఉత్సాహం ఇచ్చాయి. అదే ఉత్సాహంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు అద్భుతంగా తీసుకొస్తాం” అన్నారు.
నిర్మాత సౌమ్య చాందిని పల్లా మాట్లాడుతూ.. ‘రోలుగుంట సూరి’ ఒక రియలిస్టిక్ విలేజ్ డ్రామా. భావోద్వేగాలతో, జీవిత సత్యాలతో మిళితమైన ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మా టీమ్లో ప్రతి ఒక్కరు అద్భుతంగా తమ ప్రతిభను చూపిస్తున్నారు. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయేలా అవుతుందనే నమ్మకం మాకు ఉంది” అని తెలిపారు.
సినిమా యూనిట్ సభ్యులు చెబుతూ.. ఇలాంటి సినిమాలు గ్రామీణ జీవన శైలిని, భావోద్వేగాలను నిజ జీవితానికి దగ్గరగా చూపిస్తాయి. ‘రోలుగుంట సూరి’ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదిస్తుందనే నమ్మకం ఉందన్నారు.