Kothapalli Lo Okapudu: మనసులో నిలిచిపోతుంది
ABN, Publish Date - Jul 17 , 2025 | 06:05 AM
‘పల్లెటూరి నేపథ్యంలో వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. ఈ సినిమాలోని పాత్రల తాలూకు భావోద్వేగాలకు ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. విభిన్నమైన..
‘పల్లెటూరి నేపథ్యంలో వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. ఈ సినిమాలోని పాత్రల తాలూకు భావోద్వేగాలకు ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. విభిన్నమైన.. విలక్షణమైన సినిమాలతో టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నారు ప్రవీణ. ఆమె గొప్ప విజన్తో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రతి సన్నివేశం మనసులో నిలిచిపోయేలా ఉంటుంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి’ అని నటుడు రానా కోరారు. ఆయన సమర్పణలో ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రవీణ మాట్లాడుతూ ‘ఇది నాకు నిర్మాతగా మూడో సినిమా. దర్శకురాలిగా తొలి సినిమా. మీకు నచ్చితే మరో నలుగురికి చెప్పి మమ్మల్ని ప్రోత్సహించండి’ అని కోరారు. ‘నా సినీ గమనాన్నే మార్చే పాత్రను ఈ సినిమాలో చేశాను. మా టీమ్ అంతా చాలా కష్టపడి మీ ముందుకు మంచి సినిమాతో వస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమిది’ అని హీరో మనోజ్ చంద్ర చెప్పారు.