Rana Daggubati: ఫొటోగ్రాఫర్లపై మండిపడ్డ రానా..
ABN , Publish Date - Jun 04 , 2025 | 05:29 PM
తాజాగా రానా (Rana Daggubati).. ఫొటోగ్రాఫర్లపై మండిపడ్డ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్లకు ఎప్పుడు.. వారిని ఫోటోలు తీయడమే పని. ఎయిర్ పోర్ట్, రెస్టారెంట్, కేఫ్, జిమ్ ఇలా వారు ఎక్కడ కనిపించినా కెమెరాల తో క్లిక్ మనిపిస్తూనే ఉంటారు. బాలీవుడ్ లో కొందరు అయితే తాము ఎక్కడికి వెళ్తే అక్కడకు వచ్చి ఫోటోలు తీయమని డబ్బులు కూడా ఇస్తారట. అయితే కొంతమంది మాత్రం ఫొటోగ్రాఫర్లకు కొన్నిసార్లు ఫోటోలు ఇస్తారు. బిజీగా వెళ్తున్నా.. మూడ్ బాగోకపోయినా ఇప్పుడు కాదు అని నెమ్మదిగా చెప్తారు. ఇంకొంతమంది వారిపై మండిపడుతూ ఉంటారు.
తాజాగా రానా (Rana Daggubati).. ఫొటోగ్రాఫర్లపై మండిపడ్డ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం రానా.. రానా నాయుడు(Rana Naidu) సీజన్ 2 సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ ప్రమోషన్స్ కోసం ముంబై టూ హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. అయితే తాజాగా రానా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తూ కనిపించాడు.
Also Read: Dragon: డ్రాగన్ లో స్పెషల్ సాంగ్.. హాట్ బ్యూటీని దింపుతున్న నీల్..?
రానాను చూడగానే ఫొటోగ్రాఫర్లు ఆయన వెంట పరిగెత్తారు. కానీ, కుర్ర హీరో ఇప్పుడు కాదని వెళ్లిపోతున్నా.. ఫొటోగ్రాఫర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. రానా వెళ్తున్నా వెనుకనే వెళ్లి కేమ్రాలను క్లిక్ మనిపించారు. వారినుంచి తప్పించుకోవడానికి వెళ్తున్న రానాను ఒక అమ్మాయి ఢీకొట్టగా అతడి ఫోన్ కిందపడిపోయింది. దీంతో కోపం తెచ్చుకున్న రానా వెనక్కి వచ్చి ఫొటోగ్రాఫర్లతో మాట్లాడాడు. వద్దు అన్నప్పుడు వదిలేయొచ్చు కదా. నో చెప్పినా వెంటపడడం మంచి పద్ధతి కాదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.