సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జపనీస్‌ వీడియో గేమ్‌లో రాజమౌళి

ABN, Publish Date - Jun 26 , 2025 | 02:13 AM

దర్శకుడు ఎస్‌.ఎ్‌స.రాజమౌళి ఓ జపనీస్‌ వీడియో గేమ్‌లో కనిపించడానికి సిద్ధమయ్యారు. వీడియో గేమ్స్‌ తయారీలో పేరుగాంచిన వ్యకి హిడియో కోజిమా...

దర్శకుడు ఎస్‌.ఎ్‌స.రాజమౌళి ఓ జపనీస్‌ వీడియో గేమ్‌లో కనిపించడానికి సిద్ధమయ్యారు. వీడియో గేమ్స్‌ తయారీలో పేరుగాంచిన వ్యకి హిడియో కోజిమా. ఆయన తయారుచేసిన ‘సూపర్‌ సక్సెస్‌ గేమ్‌ డెత్‌ స్ట్రాండింగ్‌’ సెకండ్‌ వెర్షన్‌లో రాజమౌళి భాగమయ్యారు. ‘డెత్‌ స్ట్రాండింగ్‌ 2’లో హాలీవుడ్‌ నటులు నార్మన్‌ రీడస్‌, ఎల్లీ ఫానింగ్‌లతో పాటు రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. నేటి నుంచి ప్లే స్టేషన్‌లో ఈ గేమ్‌ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు విడుదల చేసిన ఓ వీడియో ఆసక్తిని రేకెత్తించింది. ఇందులో స్పృహ కోల్పోయి ఉన్న రాజమౌళిని ఓ స్ట్రెచర్‌పై చికిత్స కోసం తీసుకెళ్తుంటారు. ఆ తర్వాత ఆయన థమ్స్‌ అప్‌ సింబల్‌తో ఓకే అనడంతో వీడియో ముగుస్తుంది. కాగా, 2022లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా టైమ్‌లో రాజమౌళికి హిడియో కోజిమాతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే హిడియో కోజిమా కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు. వీటిని చూసిన అభిమానులు ఈ ఫొటోలు ఆ సినిమా ప్రచారాల్లో భాగమేమో అని అనుకున్నారు. మరోవైపు, మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ వర్కింగ్‌ టైటిల్‌. దాదాపు రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగాన్ని 2027లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రియాంక చోప్రా కథానాయిక.

Updated Date - Jun 26 , 2025 | 02:13 AM