నాపై ప్రభాస్కు ఉన్న నమ్మకమే రాజాసాబ్
ABN, Publish Date - Jun 17 , 2025 | 02:37 AM
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ ‘రాజాసాబ్’. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ కథానాయికలు. సంజయ్దల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్...
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి తెరకెక్కిస్తున్న హారర్ కామెడీ ‘రాజాసాబ్’. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ కథానాయికలు. సంజయ్దల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. డిసెంబరు 5న చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సోమవారం టీజర్ను విడుదల చేశారు మేకర్స్. వింటేజ్ లుక్లో ప్రభాస్ చేసిన హంగామా, అదిరిపోయే విజువల్స్, నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ముఖ్యంగా ప్రభాస్ సంభాషణలు, ఆయన చేసిన కామెడీ అభిమానులను ఖుషీ చేశాయి. మారుతి టేకింగ్ ప్రధానాకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మారుతి మాట్లాడుతూ ‘ఓ రోజు యువీ వంశీ నిన్ను ప్రభాస్ పిలుస్తున్నారు అని చెప్పారు. ఆయన్ని కలిసేందుకు ముంబై వెళ్లా. ‘నువ్వు చేసిన ‘ప్రేమకథా చిత్రమ్’, ‘భలేభలే మగాడివోయ్’ లాంటి వినోదాత్మక కథ రెడీ చెయ్యి. సినిమా చేద్దాం’ అని అన్నారు. ‘పక్కా కమర్షియల్’ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో నాతో సినిమా చెయ్యాలనుకున్న నిర్మాత వెనక్కి వెళ్లారు. అయినా నాపై నమ్మకంతో ప్రభాస్ ఈ సినిమాను చేశారు. ఆయనకు నాపై ఉన్న నమ్మకమే ఈ సినిమా.
షూటింగ్ మొదలయ్యాక కూడా ‘ఈ టైమ్లో ప్రభా్సకు మారుతితో సినిమా అవసరమా’.. ‘అయినా ప్రభాస్ కామెడీ చేయడమేంటి’ వంటి సందేహాలు వినిపించాయి. అన్ని సవాళ్లనూ స్వీకరిస్తూ ఈ సినిమాను మరింత పట్టుదలతో కొనసాగించా. అభిమానులు ఆయన్ని ఎంతగా ప్రేమిస్తారో తెలిసిందే. అంతకు వెయ్యిరెట్లు ఆయన వారిని ప్రేమిస్తారు’’ అని అన్నారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఆరంభం నుంచి ముగింపు వరకూ సినిమా మీ అందర్నీ ఒక్క క్షణం కూడా చూపు తిప్పుకోనివ్వకుండా ఎంటర్టైన్ చేస్తుంది. 40 నిమిషాల క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది’’ అని చెప్పారు. నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం మొదలైనప్పుడు ఓ నిర్మాత దీనిపై నెగెటివ్గా మాట్లాడారు. సినిమా విడుదలయ్యాక ఆయనే పొగుడుతారు’’ అని తెలిపారు.