Phanindra Narsetti: రావణుడు బ్రాహ్మణుడు కాదా.. చివరకు ఏం చేశాడు

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:06 PM

తాజాగా 8 వసంతాలు (8 Vasanthalu) సినిమాలోని ఒక సీన్ కాంట్రవర్సీకి గురైంది.

Panindra Narisetty

Phanindra Narsetti: ఈమధ్యకాలంలో సినిమాను సినిమాగా ఎవరు చూడలేకపోతున్నారు. ముఖ్యంగా కులం, మతం అని ఎక్కడ వినిపించినా మనోభావాలు దెబ్బతిన్నాయని సోషల్ మీడియాలో చర్చలు పెడుతున్నారు. తాజాగా 8 వసంతాలు (8 Vasanthalu) సినిమాలోని ఒక సీన్ కాంట్రవర్సీకి గురైంది. అనంతిక సనీల్ కుమార్ (Ananthika Sanilkumar) ప్రధాన పాత్రలో ఫణీంద్ర నర్సేట్టి (Panindra Narisetty) దర్శకత్వంలో తెరకెక్కిన 8 వసంతాలు సినిమా జూన్ 20 న రిలీజ్ అయ్యి మంచి టాక్ నే అందుకున్నా కలక్షన్స్ ను మాత్రం అందుకోలేకపోయింది. కానీ, సినిమా తీసిన విధానం, విజువల్స్ పరంగా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది.


ఇక దీంతో మేకర్స్ 8 వసంతాలు సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ సినిమా అంతా బావుంది కానీ, ఒక సీన్ లో తనకు అభ్యంతరం ఉందని చెప్పుకొచ్చాడు. ' సినిమాలో హీరో కులం చెప్పలేదు. హీరోయిన్ కులం చెప్పలేదు. ఈ పాత్రకు కులం చెప్పలేదు. కానీ, అత్యాచారం చేసే విలన్ క్యారెక్టర్ ను చూపించాల్సి వస్తే మీకు బ్రాహ్మిణ్ కావాల్సి వచ్చిందా.. ? కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఫైట్ సీక్వెన్స్, అత్యాచారం సీక్వెన్స్ చేయడానికి ఒక కబేళా కావాల్సి వచ్చిందా.. ? అక్కడ ఇద్దరు వేరు వేరు మతస్తులు అత్యాచారం చేసేలా తీయాల్సివచ్చిందా.. ? ఇదెక్కడి మైండ్ సెట్. హీరోను వేరే కులం అని చెప్పలేకపోయారా అంటూ ఫైర్ అయ్యాడు.


ఇక జర్నలిస్ట్ వ్యాఖ్యలపై డైరెక్ట ఫణీంద్ర నర్సేట్టి స్పందించాడు. సక్సెస్ మీట్ కు ఆయన హాజరు కాలేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. బ్రాహ్మణ సమాజానికి నా ప్రగాఢ గౌరవం, ఎందుకంటే వారు సాధారణంగా సనాతన ధర్మానికి, ముఖ్యంగా వేద సాహిత్యానికి అనాదిగా చేస్తున్న కృషికి ధన్యవాదాలు. వారి నాలుక సరస్వతి దేవికి నిలయం. కానీ, జర్నలిస్టులు అక్కడ ఒక సమాజాన్ని లేబుల్ చేసి అత్యాచారం గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారని నాకు అర్థం కాలేదు. ప్రజలు వారి సమాజం లేదా మతం ఆధారంగా కాకుండా వారి మానసిక స్థితి (మనః-ప్రవృత్తి) మరియు స్వభావం (స్వభావ) ఆధారంగా నేరం చేస్తారు. అందుకే ప్రజలు వారి సామాజిక స్థితిగతుల వెనుక భిన్నంగా ఉన్నారని చూపించడానికి ప్రయత్నించాను. నేను ఏ సమాజాన్ని కూడా పట్టించుకోలేదు. నేను పాత్రలను తదనుగుణంగా ఎంచుకున్నాను.


మీరు ఇప్పటికీ సమాజాన్ని మధ్యలోకి తీసుకువస్తే, రావణుడు ఎవరు అని నేను అడగాలనుకుంటున్నాను? బ్రాహ్మణ తండ్రి కుమారుడు. అతను స్వయంగా శివుని గొప్ప భక్తుడు, నుదిటిపై విభూతి మరియు మెడలో రుద్రాక్షలు ధరించేవాడు.మరి అతనిలో ఏమి మారింది? పండితుడైనప్పటికీ, ఉన్నత సమాజం నుండి వచ్చినప్పటికీ, వేదాలు మరియు గ్రంథాలలో గౌరవించబడినప్పటికీ, అతను ఏమి చేసాడు? మరొక వ్యక్తి భార్యను దొంగిలించాడు. అదే నేను చెప్పాను.


నేరం చేసే వ్యక్తి తన మతం లేదా కులం నుండి కాదు, తన స్వభావం మరియు మానసిక స్థితి నుండి నేరం చేస్తాడు. అది మానవ స్వభావం. నేను అదే చూపించడానికి ప్రయత్నించాను. యద్ భావం తద్ భవతి. మీరు ఏమి చూడాలనుకుంటున్నారో అదే మీకు కనిపిస్తుంది. కాబట్టి మీ దృష్టి కోణాన్ని మార్చుకోండి. అనవసరమైన విషయాలను ఇందులో కలపకండి. స్టేజీపై యాంకర్ అతన్ని పంతులు అని సంబోధించి ఉండకూడదని నేను అంగీకరిస్తున్నాను. కానీ ఒక వృద్ధుడిగా కూడా మీరు దానిని సరిదిద్దవచ్చు. లేకపోతే మొత్తానికే వదిలివేయవచ్చు. నేను కానీ, నా బృందం కానీ దాన్ని ఉద్దేశించి చేసింది కాదు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Nagababu: అంజనమ్మకు అస్వస్థత.. స్పందించిన నాగబాబు

Updated Date - Jun 24 , 2025 | 04:07 PM