Nikhil Siddhartha: సెట్‌లో భారీ ప్రమాదం..  స్పందించిన నిఖిల్‌

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:46 PM

నిఖిల్‌ సిద్ధార్థ్‌ (Nikhil Siddhartha) హీరోగా నటిస్తున్న ‘ది ఇండియా హౌస్‌’ (The india house) చిత్రం సెట్‌లో జరిగిన ప్రమాదంపై ఆయన స్పందించారు.  


నిఖిల్‌ సిద్ధార్థ్‌ (Nikhil Siddhartha) హీరోగా నటిస్తున్న ‘ది ఇండియా హౌస్‌’ (The india house) చిత్రం సెట్‌లో జరిగిన ప్రమాదంపై ఆయన స్పందించారు.  తనతోపాటు సినిమా టీమ్‌ అంతా సేఫ్‌గా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ప్రేక్షకులకు  సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు రిస్క్‌ చేయడం తప్పవు. ఆ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, మా సిబ్బంది తీసుకున్న జాగ్రత్తల కారణంగా మేం పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. కానీ, ఖరీదైన పరికరాలను కోల్పోయాం. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు’’ అని నిఖిల్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

1905 నేపథ్యంలో ప్రేమ, విప్లవం అంశాలతో నిండి ఉన్న కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. రామ్‌ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శంషాబాద్‌ సమీపంలో వేసిన సెట్‌లో ఈ ప్రమాదం జరిగింది. సముద్రం సీన్స్‌ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్‌ ట్యాంక్‌ పగిలిపోవడంతో ఒక్కసారిగా సెట్‌లోకి నీళ్లు ముంచెత్తాయి. దీంతో కొందరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. షూటింగ్‌ ఎక్విప్‌మెంట్‌ అంతా  నీట మునిగింది. ఈ సినిమా రామ్‌చరణ్‌ సమర్పణలో రానుంది. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, వి.మెగా పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Updated Date - Jun 12 , 2025 | 04:58 PM