Manoj Manchu: ఆయన కొడుకు వచ్చాడని చెప్పు.. మంచు మనోజ్ పోస్టు వైరల్
ABN , Publish Date - May 30 , 2025 | 01:29 PM
మంచు మనోజ్ తాజాగా సామాజిక మాధ్యమంలో పొస్టు చేసిన ఫొటో బాగా వైరల్ అవుతుంది.
బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ (Manoj Manchu), నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'భైరవం' (Bhairavam) . శుక్రవారం (మే 30)న థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందనను దక్కించుకుంటుంది. అయితే సుమారు తొమ్మిదేండ్ల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ తిరిగి సినిమాలో నటించడం, అది కూడా కీలక పాత్ర అవడంతో ఈ సినిమాపై అనేక మంది దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమా చూసిన చాలా మంది మంచు మనోజ్ గురించి ఓ రేంజ్లో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత నటన పెట్టుకుని ఇంతకాలం ఎందుకు సినిమాలకు దూరం అయ్యావయ్యా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే గత ఏడాదిగా తరుచూ వివాదాలతో మంచు ఫ్యామిలీ వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఆపై మంచు మనోజ్ ఇంటి నుంచి సపరేట్ అవడం కూడా జరిగి పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు'భైరవం' సినిమా రిలీజ్ కావడం మనోజ్కు మంచి పేరు వస్తుండడంతో మనోజ్ తన సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయన కొడుకు వచ్చాడని చెప్పు అంటూ పెదరాయుడు సినిమాలోని మోహన్ బాబు (Mohan Babu) ఫొటో పక్కన భైరవం (Bhairavam) సినిమాలోని తన ఫొటోను జత చేసి పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది.