Manisha Koirala: రజినీకాంత్ వలనే కెరీర్ పోయిందన్న హీరోయిన్
ABN, Publish Date - Jun 21 , 2025 | 05:00 PM
మనీషా కోయిరాలా(Manisha Koirala) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Manisha Koirala: మనీషా కోయిరాలా(Manisha Koirala) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్కడు, బొంబాయి, భారతీయుడు లాంటి హిట్ సినిమాల్లో మనీషా నటించి మెప్పించింది. ఆ సినిమాల్లో ఆమె అందం , నటనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. సినిమాల్లోనే కాకుండా మనీషా రియల్ గా కూడా ఒక స్ట్రాంగ్ మహిళ. ఎంతో భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేసి గెలిచింది. క్యాన్సర్ వలన కొన్నేళ్లు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన మనీషా ఆ తరువాత బాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చి మంచి మంచి సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా ఈ మధ్య నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన హీరామాండీలో మనీషా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
బాలీవుడ్ లో అవకాశాలను అందుకుంటున్న మనీషా.. సౌత్ సినిమాల్లో మాత్రం అస్సలు కనిపించడం మానేసింది. అయితే తనకు సౌత్ లో అవకాశాలు రాకపోవడానికి రజినీకాంత్ కారణమని మనీషా చెప్పడం సంచలనంగా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనీషా కోయిరాలా మాట్లాడుతూ " సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన బాబా సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమా వలన నేను చాలా నష్టపోయాను. ఈ సినిమాకు ముందువరకు నాకు సౌత్ లో చాలా బాగా అవకాశాలు వచ్చాయి. కానీ, బాబా సినిమా తరువాత నాకు సౌత్ లో అస్సలు ఛాన్స్ లు రాలేదు" అని చెప్పుకొచ్చింది.
బాబా సినిమా 2002 లో రిలీజ్ అయ్యింది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రజినీయే నిర్మించాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన బాబా సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఇందులో మనీషా పాత్ర అంత గొప్పది కాకపోయినా రజినీ సరసన హీరోయిన్ గా అనేసరికి ఆమె ఒప్పుకుంది. అంతకుముందే మనీషా ఒకే ఒక్కడు, బొంబాయి, భారతీయుడు లాంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మనీషా.. బాబా సినిమాతో ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ఇక బాబా తరువాత అడపాదడపా సౌత్ లో కనిపించిన మనీషా.. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
Nagababu: నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశాం.. మాదే తప్పు