సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Manchu Manoj: అయోధ్య నుంచి 'మిరాయ్' సక్సెస్ టూర్ 

ABN, Publish Date - Sep 22 , 2025 | 02:26 PM

చాలా ఏళ్ళ తర్వాత సక్సెస్ అందుకున్నారు మంచు మనోజ్. తాజాగా ఆయన నటించిన చిత్రం 'మిరాయ్'. ఇందులో ఆయన నెగిటివ్ రోల్ పోషించారు. ప్రస్తుతం ఆయన ఈ సినిమా సక్సెస్ ను ఆస్వాదిస్తున్నారు.

Manchu Manoj

చాలా ఏళ్ళ తర్వాత సక్సెస్ అందుకున్నారు మంచు మనోజ్(Manchu Manoj). తాజాగా ఆయన నటించిన చిత్రం 'మిరాయ్' (Mirai). ఇందులో ఆయన నెగిటివ్ రోల్ పోషించారు. ప్రస్తుతం ఆయన ఈ సినిమా సక్సెస్ ను ఆస్వాదిస్తున్నారు. ఆదివారం అయన  పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యకు వెళ్లి.. (Ayodhya) శ్రీరాముడిని దర్శించుకున్నారు.  అయోధ్య నుంచే 'మిరాయ్' సినిమా సక్సెస్ టూర్ ను (Mirai Success Tour) ప్రారంభిస్తున్నట్లు మనోజ్ వెల్లడించారు. మొదట హనుమాన్ గఢీని దర్శించి పూజలు చేసిన మంచు మనోజ్...ఆ తర్వాత అయోధ్య ఆలయంలో శ్రీరాముడిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా మంచు మనోజ్ (Manchu Manoj) మాట్లాడుతూ - అయోధ్య రావాలనేది నా కల. ఇప్పుడు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. అమవాస్య రోజు దర్శనం మంచిదని స్వామిజీలు చెప్పారు. శ్రీరాముడు యుద్ధంలో గెలిచి ఇక్కడికి వచ్చాడు. మేము కూడా సినిమా యుద్ధంలో గెలిచి,  విజయం సాధించి ఈ పుణ్యక్షేత్రం రావడం సంతోషంగా ఉంది. దర్శనం అద్భుతంగా జరిగింది. మరోసారి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వస్తాను. మీరంతా అయోధ్య శ్రీరాముడిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నా. రామాయణ ఇతిహాసం స్ఫూర్తి మా 'మిరాయ్'సినిమా  కథలో ఉంది. ఈ చిత్రంలో బ్లాక్ స్వార్డ్ పాత్రలో నటించాను. అశోకుడు 9 గ్రంథాల్లో రాసిన రహస్యాలు తెలుసుకుని బ్లాక్ స్వార్డ్  శ్రీరాముడిని ఎదుర్కొనే రావణుడిగా మారతాడు. ఈ పాత్రలో నటించినందుకు శ్రీరాముడికి క్షమాపణలు చెప్పుకున్నా. మా మిరాయ్ సినిమా సక్సెస్ టూర్ అయోధ్య నుంచే ప్రారంభమవుతోంది. శ్రీరాముడి ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 02:28 PM