Karthik Raju: దీర్ఘాయుష్మాన్ భవ రిలీజ్ డేట్ వచ్చేసింది...
ABN , Publish Date - Jun 27 , 2025 | 08:29 PM
ఇప్పటికే పలు చిత్రాలలో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ రాజు. హీరోయిన్ మిస్తీ చక్రవర్తి సైతం పలు చిత్రాలలో నటించింది. వీరిద్దరూ జంటగా నటించిన సినిమా దీర్ఘాయుష్మాన్ భవ.
ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా సోషియో ఫాంటసీ ప్రేమకథతో తెరకెక్కింది 'దీర్ఘాయుష్మాన్ భవ' (Dheergayushman Bhava). కార్తీక్ రాజు (Karthik Raju), మిస్తి చక్రవర్తి (Mishti Chakravarthy) హీరో హీరోయిన్లుగా ఈ సినిమాను ఎం.పూర్ణానంద్ డైరెక్ట్ చేశారు. త్రిపుర క్రియేషన్స్ పతాకంపై వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించారు.
ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'దీర్ఘాయుష్మాన్ భవ' చిత్రాన్ని జూన్ 11న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. చక్కటి ఫ్యామిలీ కథాంశంతో రెండున్నర గంటలపాటు ప్రేక్షకులను అలరింపజేసే వినోదంతో ఈ చిత్రాన్ని మలచడం జరిగిందని నిర్మాత వంకాయలపాటి మురళీ కృష్ణ చెప్పారు. సోషియో ఫాంటసీ కావడంతో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యం ఇచ్చామని, ఏ పాటకు ఆ పాట ఆహ్లాదభరితంగా ఉంటుందని అన్నారు. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని చెప్పారు.
దర్శకుడు ఎం. పూర్ణానంద్ మాట్లాడుతూ, 'ఈ చిత్రంలోని పాత్రలలో ఎవరికి వారు పోటీపడి నటించారు. జబర్దస్త్ ఆర్టిస్టుల కామెడీ ఆద్యంతం నవ్వుల పూలు పూయిస్తుంది. హీరో, హీరోయిన్లు తమ పాత్రలలో ఒదిగిపోయారు. సీనియర్ నటి ఆమని నటన మూవీకి హైలైట్. మొత్తం మీద ఓ మంచి చిత్రాన్ని చూసిన అనుభూతి ప్రేక్షకుడికి కలుగుతుంది' అని అన్నారు. ఈ సినిమాకు మల్హర్ భట్ జోష్ ఛాయాగ్రహణం సమకూర్చగా, వినోద్ యాజమాన్య సంగీతాన్ని, కిషోర్ మద్దాలి ఎడిటింగ్ అందించారు.
Also Read: Maargan Review: క్రైమ్ థ్రిల్లర్ మార్గన్ ఎలా ఉందంటే...
Also Read: Viraatapalem Thriller Series Review: విరాట పాలెం వెబ్ సీరిస్ రివ్యూ