Karnataka: థగ్లైఫ్కు భద్రత కల్పిస్తాం
ABN, Publish Date - Jun 20 , 2025 | 04:45 AM
కమల్హాసన్ నటించిన ‘థగ్లైఫ్’ సినిమాకు భద్రత కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు గురువారం అఫిడవిట్ దాఖలు చేసింది. సినిమా విడుదలపై ఎటువంటి నిర్బంధం...
సుప్రీం కోర్టులో కర్ణాటక ప్రభుత్వం
కమల్హాసన్ నటించిన ‘థగ్లైఫ్’ సినిమాకు భద్రత కల్పిస్తామని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేరకు గురువారం అఫిడవిట్ దాఖలు చేసింది. సినిమా విడుదలపై ఎటువంటి నిర్బంధం విధించలేదని అందులో పేర్కొంది. కర్ణాటక వ్యాప్తంగా సినిమా విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారని, అవసరమైతే ప్రేక్షకులకు భద్రత కల్పిస్తామని తెలిపింది. కన్నడ భాషపట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి నటుడు కమల్హాసన్ను లేఖ రాసిన విషయాన్ని అఫిడవిట్లో ప్రస్తావించింది. కాగా, కన్నడ సంఘాల నేతలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. సినిమా విడుదలను అడ్డుకోవద్దని ఆదేశించింది. ఈ విషయమై కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ. థగ్లైఫ్ సినిమా విడుదలకు తమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేయలేదని అన్నారు. కానీ తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ కమల్హాసన్ చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపామని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను కన్నడ సంఘాలతో పాటు అందరూ పాటించాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. చట్టాన్ని ఎవరూ ఉల్లంఘించవద్దని, కర్ణాటక శాంతికి కేంద్రమనే విషయాన్ని మరువరాదని ఆయన అన్నారు.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి)