పాటల రికార్డింగ్ లో 'కంచు కనకమాలక్ష్మి'
ABN, Publish Date - Oct 02 , 2025 | 10:58 PM
యువన్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై గణేష్ అగస్త్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'కంచు కనకమాలక్ష్మి'. విజయదశమి సందర్భంగా పూజ కార్యక్రమాలు, పాటల రికార్డింగ్ తో సినిమా ప్రారంభం చేసారు మేకర్స్.
యువన్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై గణేష్ అగస్త్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'కంచు కనకమాలక్ష్మి'. విజయదశమి సందర్భంగా పూజ కార్యక్రమాలు, పాటల రికార్డింగ్ తో సినిమా ప్రారంభం చేసారు మేకర్స్. మల్లిక శంకర్ , కిషోర్ రావు, గౌతమ్ నంద, అమిత శ్రీ, హీరో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు . అజయ్ పట్నాయక్ సంగీత సారధ్యంలో పాటల రికార్డింగ్ తో ప్రారంభం అయిన ఈ చిత్రానికి వీరేంద్రనాథ్ కోలుకుల, భరత్ అట్లూరి, బృందకర్ గౌడ్ ,రాజేష్ గంగునాయుని, గణపతి నాయుడు సీర, కొండల రావు చూక్కాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
దర్శకుడు గణేష్ అగస్త్య మాట్లాడుతూ 'క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న చిత్రమిది. స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చుతుంది. కథ చాలా కొత్తగా ఉంటుంది, సస్పెన్స్, ట్విస్ట్ లు చాలా బాగుంటాయి. అందరి క్యారెక్టర్ లు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అజయ్ పట్నాయక్ సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్ తో సినిమా పనులు ప్రారంభించాము. ఈ నెల 10 నుంచి షూటింగ్ కి వెళ్ళబోతున్నాము. విజయనగరం, పట్టిసీమ, అరకు పరిసర ప్రాంతాల్లో 28 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేసాము.. తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తాం' అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ 'ఏడాదికి 3 సినిమా లు చెయ్యాలనే సంకల్పం తో వచ్చాము. మంచి కథతో వస్తున్నాం అని చెప్పారు.