105 Minutes: హన్సిక మూవీ కెమెరామ్యాన్ కు అవార్డు
ABN , Publish Date - Jun 28 , 2025 | 09:56 PM
సింగిల్ షాట్ లో, సింగిల్ క్యారెక్టర్ తో రూపుదిద్దుకున్న సినిమా 105 మినిట్స్. హన్సిక నటించిన ఈ సినిమాకు కిశోర్ బొయిదాపు కెమెరామ్యాన్ గా వర్క్ చేశారు. అందుకు గానూ ఆయన కెమెరామ్యాన్ గా ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్ ను అందుకున్నారు.
ప్రముఖ హీరోయిన్ హన్సిక మోత్వాని (Hansika Motwani) నటించిన '105 మినిట్స్' (105 Minutes) చిత్రానికిగాను సినిమాటోగ్రఫీ విభాగంలో ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్ అందుకున్నారు టాలెంటెడ్ యంగ్ కెమెరామ్యాన్ కిషోర్ బొయిదాపు. పరిమిత బడ్జెట్ లో, సింగిల్ క్యారక్టర్ తో, సింగిల్ షాట్ లో తెరకెక్కిన సినిమా '105 మినిట్స్'. హైదరాబాద్ లోని లీ-మెరిడియన్ హోటల్ లో జరిగిన వేడుకలో కిషోర్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం స్వీకరించారు. ఈ సందర్భంగా '105 మినిట్స్' చిత్ర దర్శకులు రాజు దుస్సా, నిర్మాత బొమ్మక్ శివలకు కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు.
రవిప్రసాద్ యూనిట్ లో కెమెరా అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించిన కిషోర్ అనతికాలంలోనే అంచెలంచెలుగా కెమెరామెన్ స్థాయికి ఎదిగారు. 'స్లమ్ డాగ్ మిలియనీర్ (Slumdog Millionaire), మిషన్ ఇంపాజిబుల్-4 (Mission Impossible 4), లెటర్స్, సూటబుల్ బాయ్స్' వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కు సెకండ్ యూనిట్ కెమెరామెన్ గా పనిచేశారు. ప్రఖ్యాత సినిమాటోగ్రఫర్ అనిల్ మెహతా ప్రియ శిష్యుడిగా, 'సీక్రెట్ సూపర్ స్టార్, ఏ దిల్ హై ముష్కిల్, బియాండ్ ది క్లౌడ్స్, జెర్సీ (హింది)' తదితర చిత్రాలకు పనిచేయడంతో పాటు అగ్ర హీరోలు నటించిన యాడ్ ఫిల్మ్స్ సైతం కిశోర్ హ్యాండిల్ చేశారు.
'బోయ్ మీట్స్ గర్ల్' మూవీతో కెమెరామ్యాన్ గా మారిన కిషోర్, 'కిరాక్, వశం', ఫిల్మ్ జర్నలిస్ట్ టర్నడ్ డైరెక్టర్ నాగు గవర దర్శకత్వం వహించిన 'కర్త - కర్మ - క్రియ', హన్సిక నటించిన '105 మినిట్స్, మై నేమ్ ఈజ్ శృతి (My Name is Shruthi)' చిత్రాలకు ఛాయాగ్రహణం చేశారు. సునీల్ నటిస్తున్న 'ఆన్ ది వే', ఆది సాయికుమార్ 'రుధిరాక్ష', బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ, శివాజీ, భూమిక నటిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రాలకూ ఆయన సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. జేబు శాటిసిఫేక్షన్ కంటే జాబు శాటిసిఫేక్షన్ కి ప్రాధాన్యత ఇస్తానంటున్న కిశోర్ ప్రపంచవ్యాప్తంగా పలు భాషలకు చెందిన టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్స్ సినిమాలు తెరకెక్కించే తీరుతెన్నులను నిశితం తనకు ఇష్టమని చెబుతున్నారు. అటువంటి లెజండరీ సినిమాటోగ్రాఫర్స్ ఇంటర్వ్యూస్ ను ఫాలో అవుతానని, తద్వారా తనను తాను అప్ డేట్ చేసుకుంటానని కిశోర్ తెలిపారు. ఇటీవలే ముంబై నుంచి హైదరాబాద్ కు మకాం మార్చిన కిషోర్... ఇకపై తన ఫోకస్ తెలుగు సినిమాలపై మాత్రమేనని తెలిపారు.
Also Read: Akkineni Family: ఒకే ఫ్రేమ్ లో అక్కినేని కోడళ్లు.. అత్తగారు కూడా ఉంటేనా...
Also Read: Harihara Veeramallu: వీరమల్లు ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్