విష్ణు మూర్తి అవతారాలపై ఏడు సినిమాలు
ABN, Publish Date - Jun 26 , 2025 | 02:15 AM
‘కేజీఎఫ్’, ‘సలార్’, ‘కాంతార’ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ఇప్పుడు వరుస సినిమాలను నిర్మించనుంది. 2037 వరకూ ఏడు సినిమాలను...
‘కేజీఎఫ్’, ‘సలార్’, ‘కాంతార’ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ఇప్పుడు వరుస సినిమాలను నిర్మించనుంది. 2037 వరకూ ఏడు సినిమాలను రూపొందిస్తున్నట్లు.. వాటి పేర్లను ప్రకటించింది. ఈ చిత్రాలన్నీ మహా విష్ణువు పది అవతారాలపై ఉండబోతున్నాయి. ఏడు భాగాలుగా తెరకెక్కుతున్న వీటిలో మొదటి పార్ట్ను ఇప్పటికే దర్శకుడు అశ్విన్కుమార్ ‘మహావతార్: నరసింహా’ పేరుతో జూలై 25న విడుదలకు సిద్ధం చేశారు. త్రీడీలో ఐదు భాషల్లో విడుదలవుతోందీ చిత్రం. అలాగే ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘రోర్ ఆఫ్ నరసింహా’ను విడుదల చేశారు మేకర్స్. అలాగే మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో నిర్మాణ సంస్థ నిర్మించనున్న మరో ఆరు చిత్రాల పేర్లనూ తెలిపారు. 2027లో ‘మహావతార్ :పరశురామ్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. 2029లో ‘మహావతార్ :రఘునందన్’ను, 2031లో ‘మహావతార్ :ద్వారకాదీశ్’ను, 2033లో ‘మహావతార్ :గోకులానంద్’ను, 2035లో ‘మహావతార్ :కల్కి 1’ను, 2037లో ‘మహావతార్ :కల్కి 2’ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.