సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

HHVM: హరిహర వీరమల్లు.. జ్యోతి కృష్ణ చెప్పిన విశేషాలు..

ABN, Publish Date - Jun 07 , 2025 | 05:51 PM

ఎదుటివారి ప్రతిభను ఆయన ఎంతగానో గుర్తిస్తారు. ఒక్కసారి నమ్మారంటే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఆయన నన్ను ఎంతగానో నమ్మారు.


పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ప్రధాన పాత్ర పోషిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణ (jyothy krishna) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు జ్యోతి కృష్ఱ మచిలీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. సుమారు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు.

ఆయన మాట్లాడుతూ ‘‘పవన్‌ కల్యాణ్‌తో వర్క్‌ చేసే  అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎదుటివారి ప్రతిభను ఆయన ఎంతగానో గుర్తిస్తారు. ఒక్కసారి నమ్మారంటే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఆయన నన్ను ఎంతగానో నమ్మారు. నాతో సినిమా చేశారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నా. ఇప్పటికే ఆయన రెండు మూడు సార్లు సినిమా చూశారు. దాదాపు గంట సేపు నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. నాతో మరో సినిమా చేయాలనుందని అన్నారు. ఆయన మాటలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి. బందరు పోర్ట్‌కు సంబంధించి మన సినిమాలో ఒక భారీ సీక్వెన్స్‌ ఉంది. కథకు తగిన విధంగా సీజీలో ఈ పోర్ట్‌ రీ క్రియేట్‌ చేయడానికి సుమారు రెండేళ్లు కష్టపడ్డాం. పోర్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రాక్టీస్‌ చేశారు. మీకు మంచి చిత్రాన్ని ఇచ్చేందుకు పవన్‌ ఎంతో శ్రమించారు’’ అని అన్నారు.



మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రం పవన్‌ కెరీర్‌ టైలర్‌ మేడ్‌ చిత్రమవుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. ఇది. కీరవాణి స్వరకర్త. రెండు పార్టులుగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నెల 2న విడుదల చేయాలని ప్లాన్‌ చేసినా పలు కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని నిర్మాత ప్రకటించారు. 

Updated Date - Jun 07 , 2025 | 05:58 PM