Plane Crash: విమాన ప్రమాదంపై ప్రముఖుల సంతాపం!
ABN , Publish Date - Jun 12 , 2025 | 05:13 PM
ఇండియాలోనే అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది ఈరోజు జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Ahmedabad plane crash).
Plane Crash: ఇండియాలోనే అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది ఈరోజు జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Ahmedabad plane crash). గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్న విమానం టేకాప్ అయిన కొద్దీ క్షణాల్లోనే పక్కనే ఉన్న బీజీ మెడికల్ హాస్టల్ పైన కుప్పకూలిపోయింది. దీంతో ఒక్కసారిగా అక్కడ భారీ మంటలు చెలరేగాయి. దాదాపు ఈ ప్రమాదంలో 200 మందికి పైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఈ విమానంలో 169 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం.
ఇక ఈ ఘటన ఇండియాలోనే మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ వార్త విన్న చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. విమాన ప్రమాదంలో మృతిచెందిన వారికి సంతాపం తెలుపుతూ.. వారి కుటుంబాలకు ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పోస్టులు పెడుతున్నారు.
Kannappa: విమాన ప్రమాదం.. కన్నప్ప టీమ్ షాకింగ్ నిర్ణయం!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విమాన ప్రమాదం వార్త తెలుసుకొని దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. "అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం – టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాము. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ దుర్ఘటనలో మృతులకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇది" అంటూ చెప్పుకొచ్చారు.
ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) " అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం వార్త విని తీవ్ర దిగ్భ్రాంతి చెందాను. బాధితులందరూ ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు, క్రూ సభ్యులు.. వారి ఫ్యామిలీలతోనే నా ఆలోచనలు ఉన్నాయి" అని పోస్ట్ చేశాడు.
" అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. నిజంగా హృదయ విదారకం" అంటూ అల్లు అర్జున్(Allu Arjun) పోస్ట్ చేశాడు. వీరితో పాటు క అడివి శేష్, మంచు మనోజ్, శ్రీ విష్ణు, లక్ష్మీ మంచు, నారా రోహిత్, వరుణ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ తదితరులు సంతాపం తెలుపుతూ పోస్టులు పెట్టారు. ఇక బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, అలియా భట్, జాన్వీ కపూర్, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్స్ విమాన ప్రమాదంపై తన సంతాపాన్ని తెలిపారు.