మా కథని కాపీ కొట్టారు
ABN, Publish Date - Jun 26 , 2025 | 01:59 AM
వర్ష బొల్లమ్మ టైటిల్ పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. ప్రశాంత్కుమార్ దిమ్మల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సిరీ్సలో రాజీవ్ కనకాల, మేఘ లేఖ...
వర్ష బొల్లమ్మ టైటిల్ పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. ప్రశాంత్కుమార్ దిమ్మల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సిరీ్సలో రాజీవ్ కనకాల, మేఘ లేఖ, రమణ భార్గవ్ కీలక పాత్రలు పోషించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి బుధవారం ఓ ముఖ్యమైన ప్రెస్మీట్ నిర్వహించారు. ఇందులో దర్శకుడు ప్రశాంత్కుమార్ మాట్లాడుతూ ‘ఈ వెబ్ సిరీ్సను మేం ఎంతో కష్టపడి తీశాం. కానీ మా కథను కాపీ కొట్టి వేరే ఓటీటీ సంస్థ నిర్మించిన మరో సిరీస్ ట్రైలర్ బయటకు వచ్చింది. అది చూసి మేం షాక్ అయ్యాం. న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. కోర్టులో కేసు నడుస్తోంది. రచయితగా, దర్శకుడిగా ఒక కథను ఎంతో మందికి చెబుతాం. అలాగే ఓ సంస్థకు చెప్పాను. కొంత వర్క్ చేసిన తర్వాత వాళ్లు వద్దనుకున్నారు. ఆ తర్వాత నేనే ఈటీవీ విన్ వారిని సంప్రదించాను. వారికి నచ్చడంతో ప్రాజెక్ట్ మొదలైంది. ఇప్పుడు అదే కథతో మరో ఓటీటీ సంస్థ సిరీస్ చేయడం బాధగా ఉంది. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.’ అని చెప్పారు. ‘ఇది ఈటీవీ విన్ ఒరిజనల్ సిరీస్ అనీ, రెండు సీజన్స్ను చాలా ప్రిస్టేజియ్సగా రూపొందిస్తున్నామనీ ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ చెప్పారు. ఇంతవరకూ తాము తీసిన సిరీ్సలో ఇది భారీ బడ్జెట్తో రూపొందుతోందని ఆయన తెలిపారు. ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ ‘హై బడ్జెట్, ప్రొడక్షన్ వాల్యూ్సతో తీస్తున్న సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. ఒక ఒరిజనల్ కథను తీసుకుని అందులో ఓ మెలిక పెట్టినంత మాత్రాన అది అసలైన కథ కాదు.. దొంగతనమే అవుతుంది’ అన్నారు.