Director Maruthi: డార్లింగ్.. ఇద్దరు హీరోయిన్లను పెట్టవా అని అడిగాడు
ABN, Publish Date - Jun 16 , 2025 | 03:26 PM
ఎట్టకేలకు రాజాసాబ్(RajaSaab) టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎన్నో నెలలుగా ఈ టీజర్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Director Maruthi: ఎట్టకేలకు రాజాసాబ్(RajaSaab) టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎన్నో నెలలుగా ఈ టీజర్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలతోనే అలరించిన ప్రభాస్.. కొద్దిగా ఛేంజ్ కోసం ఈ రాజాసాబ్ సినిమా చేసాడు. మారుతీ(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్(Nidhhi Agerwal), మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ది కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
నేడు రిలీజ్ అయిన టీజర్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంది. నవ్వులు పూయిస్తూనే భయపెట్టింది. ఇక టీజర్ ఈవెంట్ లో మారుతీ ప్రభాస్ గురించి మాట్లాడాడు. " పక్కా కమర్షియల్ సినిమా సమయంలో నాకు వేరే నిర్మాత కాకుండా ప్రభాస్ కథ కూడా ఓకే అయ్యింది. అయితే పక్కా కమర్షియల్ ప్లాప్ అవ్వడంతో ఆ నిర్మాత తన సినిమాను డ్రాప్ చేశాడు. కానీ, ప్రభాస్ మాత్రం ఇచ్చిన మాట మీదనే నిలబడ్డాడు. ఆ సమయంలో నేను కూడా వద్దు అనుకున్నాను.
The Rajasaab: రాజా సాబ్.. మారుతి మొత్తం చెప్పేశాడు..
డార్లింగ్ ఇప్పుడు కాదు.. తరువాత చేద్దాం లే అని మెసేజ్ పెడదాం అనుకున్నాను. వంశీ కి కూడా అదే చెప్పాను. డార్లింగ్ ఈ సినిమా ఆపేద్దాం. ఆయన విజయాల్లో ఉన్నారు. నేనేమో కింద ఉన్నాను. సరే ఆలోచించుకో అని వంశీ వెళ్ళిపోయాడు. సాయంత్రం ప్రభాస్ ఫోన్ చేసి.. డార్లింగ్ ఆ కథ బావుంది.. ఇది ఇలా చేద్దాం అని చెప్తున్నాడు. ఈయనేంటి నన్ను ఇంత నమ్ముతున్నాడు అని, అసలు నేను హైదరాబాద్ వచ్చింది వెనక్కి వెళ్ళడానికి కాదు కదా అని అనుకోని రెండు రోజులు కథను రెడీ చేసే డార్లింగ్ కు వినిపించి అలా అలా రాజాసాబ్ ఇలా అయ్యింది.
ఇక ఒకసారి ప్రభాస్ మాట్లాడుతూ డార్లింగ్ .. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను పెడతావా అని అడిగాడు. హీరోయిన్స్ లేక డ్రై గా ఉంది. లైఫ్ లో ఎలాగూ లేరు. కనీసం సినిమాలోనైనా పెడతావా అని అడిగాడు. అందుకు నేను నీ రేంజ్ కు ఇద్దరినీ ఏంటీ డార్లింగ్ ముగ్గురిని పెడతాను అని ముగ్గురు హీరోయిన్స్ తో ఇంట్లో రచ్చ చేయించాను" అని మారుతీ చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 5 న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా మారుతీకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.