Dil Raju: దిల్ రాజు షాకింగ్ నిర్ణయం.. ఇక నుంచి వ్యూస్ కొనాలనుకోవడం లేదు
ABN , Publish Date - Jun 11 , 2025 | 08:47 PM
టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు(Dil Raju) షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇకనుంచి తన సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్, టీజర్ కు వచ్చే వ్యూస్ ను కొనాలనుకోవడం లేదని, ప్రేక్షకులు ఎంతవరకు నచ్చితే అంతవరకే చూస్తారని చెప్పుకొచ్చాడు.
Dil Raju: టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు(Dil Raju) షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇకనుంచి తన సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్, టీజర్ కు వచ్చే వ్యూస్ ను కొనాలనుకోవడం లేదని, ప్రేక్షకులు ఎంతవరకు నచ్చితే అంతవరకే చూస్తారని చెప్పుకొచ్చాడు. తమ్ముడు(Thammudu)సినిమా నుంచే ఈ పద్దతికి నాంది పలుకుతున్నట్లు తెలిపాడు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అభిమానుల కోసం వ్యూస్ ను కొని.. మిలియన్ వ్యూస్ వచ్చేలా చేస్తున్నారు నిర్మాతలు. ఆ లెక్కలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో అభిమానులు ఆ లెక్కలు నిజమే అనుకోని.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కొట్టుకుంటున్నారు.
ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల టీజర్లు, ట్రైలర్లు, సాంగ్స్ రిలీజ్ అయిన గంటలోనే అన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయని మేకర్స్ పోస్టర్స్ ను రిలీజ్ చేస్తున్నారు. దాన్ని చూసిన ఫ్యాన్స్ మిగతా హీరోల ట్రైలర్స్ కంటే మా హీరో ట్రైలర్ నే టాప్ వచ్చిందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉండడం చూస్తూనే ఉంటాం. ఇలా చేసి సినిమాపై హైప్ పెంచుతున్నారు. ఇక ఈ హైప్ తో థియేటర్ లోకి వెళ్లిన ప్రేక్షకుడికి కొన్నిసార్లు నిరాశ తప్పడం లేదు. కలక్షన్స్ విషయంలో కూడా కొంతమంది మేకర్స్ ఇలానే ఫేక్ కలక్షన్స్ చూపిస్తున్నారు. ఇకనుంచి ఇలాంటివాటికన్ని దిల్ రాజు బంద్ ప్రకటించాడు. ఎప్పటినుంచో ఈ విషయాన్నీ చెప్పాలని చూస్తున్న దిల్ రాజు.. తమ్ముడు ట్రైలర్ రిలీజ్ వేడుకలో నిర్మొహమాటంగా చెప్పేశాడు.
8 Vasantalu: '8 వసంతాలు' నుంచి చిత్ర పాడిన పాట రిలీజ్!
" యూట్యూబ్ లో ట్రైలర్ రిలీజ్ చేశాం. అక్కడ వచ్చే నెంబర్స్ ఉంటాయి కదా. అన్ని ఒరిజినల్. ప్రేక్షకులు చూసే నెంబర్స్ మాత్రమే అక్కడ ఉండాలని మా ఆఫీస్ లో ఖరాకండీగా చెప్పేసాను. బిలియన్స్, మిలియన్స్ డబ్బులు పెట్టి కొనకండి. ఎందుకంటే.. ఒరిజినల్ గా మన సినిమా ట్రైలర్ కానీ, సాంగ్ కానీ ఎంత రీచ్ అవుతుందో మనకు తెలిస్తే సినిమా ప్రేక్షకులకు ఎంత రీచ్ అవుతుందో తెలుస్తోంది. మనం కొనేసుకొని ఇచ్చే నెంబర్ తో అక్కడ నెంబర్ మాత్రమే కనిపిస్తుంది కానీ, అది ప్రేక్షకుడికి రీచ్ అయ్యిందా.. ? అవ్వడం లేదా.. ? అనేది తెలియడం లేదు. అందుకే కొంచెం కష్టమైన నేనే మొదటి స్టెప్ వేశాను. నేను ఎవరిని ఉద్దేశించి అనడం లేదు. జెన్యూన్ గా మన సినిమా ఎలా రీచ్ అవుతుంది అనేది మనకు తెల్సినప్పుడే ఏది రీచ్ అవుతుంది.. ? ఏది అవ్వడం లేదు అనేది తెలుస్తోంది. రీచ్ అవ్వకపోతే ఏం చేయాలి.. ? అనేది తెలుస్తోంది. దానికొక అవేర్నెస్ ఉండాలి. దానికోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. విషయం ఉంటే సినిమా అదే రీచ్ అవుతుంది. లేకపోతే ప్రేక్షకులే రిజెక్ట్ చేస్తారు. ఇంకెందుకు టెన్షన్. అందుకే వద్దు వ్యూస్ కొనకండి అని చెప్పాను. కంటెంట్ మంచిగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రుజువు అయ్యింది. అందుకే కంటెంట్ లో కష్టపడదాం" అని చెప్పుకొచ్చాడు.
దిల్ రాజు తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా.. దీనివలన అభిమానుల మధ్య గొడవలు ఇంకా పెరుగుతాయని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇప్పటివరకు ఫేక్ వ్యూస్ ద్వారా.. ఫేక్ కలక్షన్స్ ద్వారా స్టార్స్ అనిపించుకుంటున్న హీరోలు.. ఇప్పుడు ఒరిజినల్ వ్యూస్ కనుక బయటపడితే వారికున్న ఇమేజ్ ఏమవుతుంది.. ? అనేది ప్రశ్న. దిల్ రాజు తీసుకున్న నిర్ణయం.. స్టార్స్ కు రియల్ పరీక్షగా మారింది. ఇక నుంచి సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు అని తేడా లేకుండా ఎవరికి ఎక్కువ ఒరిజినల్ వ్యూస్ వస్తాయో వారే స్టార్స్ గా నిలబడతారు. మా హీరో గొప్ప.. మా హీరో గొప్ప అని చెప్పుకొనే అభిమానులకు ఈ ఒరిజినల్ వ్యూస్ వారి అసలైన స్టామినాను నిరూపిస్తాయి. మరి దిల్ రాజు వేసిన స్టెప్ దావానంలా పాకి మిగతా ప్రొడ్యూసర్స్ కూడా ఈ పద్దతిని పాటిస్తారా.. ? లేక దిల్ రాజు ఒక్కడినే ఇందులో ఒంటరివాడిని చేస్తారా.. ? అనేది చూడాలి.