Anupama Parameswaran: నాకు నటించడం రాదన్నారు
ABN, Publish Date - Jun 17 , 2025 | 04:13 PM
కెరీర్ మొదట్లో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ట్రోల్స్ కు గురయ్యాయని, తనకు నటించడం రాదని చెప్పారని చెప్పుకొచ్చింది.
Anupama Parameswaran: ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్నవారందరూ కూడా మొదట్లో నటించడానికి పనికిరారు అని అనిపించుకున్నవారే. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలబడి ఒక స్థాయికి వచ్చారు. తాజాగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ను కూడా మొదట్లో నటించడానికి పనికిరాదు అని చెప్పారట. కానీ, ఆమె వాటిని పట్టించుకోకుండా ఎంతో హార్డ్ వర్క్ చేసి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ.. మలయాళంలో మాత్రం చాలా తక్కువ సినిమాలు చేసింది.
తాజాగా అనుపమ పరమేశ్వరన్ మలయాళంలో జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా చేస్తోంది. సురేష్ గోపి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన అనుపమ పరమేశ్వరన్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనుపమ.. ఆమె ఎందుకు ఎక్కువ మలయాళ సినిమాలు చేయలేకపోయిందో చెప్పుకొచ్చింది. కెరీర్ తొలినాళ్లలో తాను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలిపింది.
"మొదట నన్ను చాలామంది ట్రోల్స్ చేశారు. నాకు అసలు నటించడమే రాదు అన్నారు. అలా ట్రోల్స్ చేసినా కూడా అవేమి పట్టించుకోకుండా డైరెక్టర్ ప్రవీణ్ నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చాడు. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ లాంటి గొప్ప సినిమాలో నేను నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా మీద వచ్చిన ట్రోల్స్ నన్ను ఎంతగానో ఆలోచింపజేశాయి.
ఇకనుంచి నేను ఎంచుకొనే ప్రతిపాత్ర ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఉండాలని , అలాంటి సినిమాలనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. కరోనా సమయంలో వ్యక్తిగతంగానే కాకుండా కెరీర్ పరంగా కూడా నేను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. వాటన్నింటిని అధిగమించి ఇప్పుడు నిలబడ్డాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రవీణ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను ఇష్టపడినవారికి, ద్వేషించేవారికి కూడా నా కృతజ్ఞతలు" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుపమ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Sikandar: పైరసీతో సల్మాన్ చిత్రానికి దాదాపు వందకోట్ల నష్టం