AM Rathnam: తెలంగాణ సీఎంను కలిసిన నిర్మాత ఎ.ఎం రత్నం

ABN, Publish Date - May 30 , 2025 | 05:01 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని (Revanth reddy) సినీ నిర్మాత ఎ.ఎం.రత్నం (A. M. Rathnam) కలిశారు. ‘హరిహర వీరమల్ల్లు’  చిత్రానికి సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చించారు.

AM Rathnam: తెలంగాణ సీఎంను కలిసిన నిర్మాత ఎ.ఎం రత్నం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని (Revanth reddy) సినీ నిర్మాత ఎ.ఎం.రత్నం (A. M. Rathnam) కలిశారు. ‘హరిహర వీరమల్ల్లు’  చిత్రానికి సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మణ సంస్థ ఓ పోస్ట్‌ చేసింది. 17వ శతాబ్దానికి సంబంధించిన కథతో రూపొందిన ‘హరిహర వీరమల్లు’ గురించి సీఎంతో చర్చించాను.  అలాగే తెలంగాణలో ఈ సినిమా టికెట్‌ ధరల గురించి కూడా మాట్లాడినట్లు, తన విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి ఎ.ఎం రత్నం కృతజ్ఞతలు తెలిపారు.  పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీరమల్ల్లు’. నిధి అగర్వాల్‌ కథానాయిక. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రం జూన్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Updated Date - May 30 , 2025 | 05:01 PM