Nagarjuna: తెలంగాణ సీఎంను కలిసిన నాగార్జున..

ABN , Publish Date - May 31 , 2025 | 02:29 PM

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున కలిశారు.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని  అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి తన చిన్న కుమారుడు అఖిల్‌ వివాహ వేడుకకు ఆహ్వానించారు. అలాగే ఆయనతో కాసేపు చర్చించారు. గతేడాది నవంబర్‌లో అక్కినేని అఖిల్‌ నిశ్చితార్థం జైనబ్‌ రవ్జీతో జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వీరి పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. జూన్‌ 6న ఈ వేడుక జరగనున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

ALSO READ: R Narayan Murthy: పవన్‌ కల్యాణ్‌ అలా అనకుండా ఉండే బావుండేది..

Mahesh Babu: నా దర్శకులకు ప్రేమ పంచుతున్నా

Sreeleela engagement: శ్రీలీల నిశ్చితార్థం.. కమింగ్‌ సూన్‌..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 




Updated Date - May 31 , 2025 | 02:29 PM